logo

చెట్టుకు ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

పట్టణ సమీపంలోని పెద్దపూదెళ్ల పొలిమేర వద్ద ఉన్న పొలంలో లక్ష్మీనరసింహా (18) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... పట్టణంలోని సినిమా వీధిలో నివాసముంటున్న చెట్నేపల్లి దాసు,

Published : 17 Aug 2022 02:51 IST

లక్ష్మీనరసింహ (పాత చిత్రం)

ప్యాపిలి, న్యూస్‌టుడే: పట్టణ సమీపంలోని పెద్దపూదెళ్ల పొలిమేర వద్ద ఉన్న పొలంలో లక్ష్మీనరసింహా (18) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... పట్టణంలోని సినిమా వీధిలో నివాసముంటున్న చెట్నేపల్లి దాసు, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు లక్ష్మీనరసింహ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియేట్‌ అభ్యసిస్తున్నారు. సోమవారం రాత్రి లక్ష్మీనరసింహా తన మిత్రులు రవితేజ, ప్రవీణ్‌కుమార్‌తో కలిసి మద్యం తాగి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు.ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్నేహితులను విచారించారు. లక్ష్మీనరసింహ పొలంలో చీరతో చెట్టుకు ఉరేసుకున్నాడని తోటి మిత్రులు గోవింద్‌, లక్ష్మీనారాయణ వారికి తెలిపారు. యువకుడి తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లి మృతదేహన్ని కిందికి దించి చికిత్స నిమిత్తం డోన్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే తోటి మిత్రులే లక్ష్మీనరసింహను చంపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని