చికెన్ వ్యర్థం కోట్లు పలుకుతోంది
చికెన్ వ్యర్థాల వ్యాపారం రూ.కోట్లు కురిపిస్తోంది. దీనిని నగరపాలక సంస్థ పరిధిలోకి తీసుకొస్తే ఆదాయం సమకూరుతుందని ఇటీవల జరిగిన నగర పాలకవర్గ సమావేశంలో డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక ప్రస్తావించారు. ఈ అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ‘న్యూస్టుడే’ ఆరా తీయగా చికెన్ వ్యర్థాలు చేపల చెరువుల్లో
అనుమతుల్లేకుండా తరలింపు
ప్రజాప్రతినిధులకు వాటాలు
- న్యూస్టుడే, కర్నూలు నగరపాలక సంస్థ
కోడిమాంసం వ్యర్థాలు
చికెన్ వ్యర్థాల వ్యాపారం రూ.కోట్లు కురిపిస్తోంది. దీనిని నగరపాలక సంస్థ పరిధిలోకి తీసుకొస్తే ఆదాయం సమకూరుతుందని ఇటీవల జరిగిన నగర పాలకవర్గ సమావేశంలో డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక ప్రస్తావించారు. ఈ అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ‘న్యూస్టుడే’ ఆరా తీయగా చికెన్ వ్యర్థాలు చేపల చెరువుల్లో వేయడంతోపాటు మరికొన్నింటిలో వాడుతున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ పెరగడంతో దీన్ని కొందరు వ్యాపారంగా మార్చుకున్నారు. పసిగట్టిన ప్రజాప్రతినిధులు వాటాలు తీసుకుని అనధికారిక అనుమతులు ఇస్తున్నారు.
చేపల చెరువులకు తరలింపు
* కర్నూలు నగరంలో 52 వార్డుల్లో ఆరు లక్షలకుపైగా జనం నివసిస్తున్నారు. 500కుపైగా చికెన్ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. నిత్యం సుమారు 15 టన్నుల లైవ్ కోళ్లు, ఆదివారం 30 టన్నుల వరకు లైవ్ కోళ్లు ఆయా కేంద్రాల నిర్వాహకులు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతి నెలా 500 టన్నుల వరకు లైవ్ కోళ్లు కర్నూలు నగరానికి దిగుమతి అవుతున్నాయి.
* దుకాణాల్లో చికెన్ విక్రయించగా మిగిలిన చర్మం, పేగులు, కాళ్లు తదితర వ్యర్థాలు రాత్రి వేళ ఓ ముఠా గుట్టుగా వాహనాల్లో తీసుకెళ్తోంది.వీటిని తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాకు తరలిస్తున్నారు. అక్కడ చేపల చెరువుల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వీటిని గ్రేడింగ్ చేసి చేపలకు ఆహారంగా వేస్తున్నట్లు తెలుస్తోంది.
తరలించేందుకు ‘పోటీ’ పడుతున్నారు
కిలో లైవ్ కోడి నుంచి 300 గ్రాముల వరకు వ్యర్థాలొస్తాయి. కర్నూలు నగరంలో ప్రతి నెలా 500 టన్నులకుపైగా లైవ్ కోళ్లను దిగుమతి చేస్తున్నారు. వీటి ద్వారా 150 టన్నుల వరకు వ్యర్థాలు వస్తున్నాయి. వీటిని తీసుకెళ్తున్న ఒక్కో వ్యాపారి నిత్యం రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకు ఆర్జిస్తున్నారు. వ్యాపారం లాభసాటిగా ఉండటంతో చాలా మంది ఇందులోకి ప్రవేశిస్తున్నారు. చికెన్ వ్యర్థాలు తీసుకోవడానికి ‘పోటీ’ పడుతున్నారు. వ్యర్థాలు ఉచితంగా ఇస్తున్నందుకు చికెన్ విక్రయదారులకు ఏడాదికి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు డబ్బులు ముట్టచెబుతున్నారు. వ్యర్థాలు తమకే ఇవ్వాలని.. ఇతరులకు ఇవ్వకూడదంటూ ముందస్తుగా అడ్వాన్స్లు ఇస్తుండటం గమనార్హం.
నగర పాలక ఆదాయానికి గండి
* నగరపాలక అధికారులు.. వ్యర్థాలే కదా.. అనుకున్నారో ఏమో కానీ.. వీటి నుంచి పెద్దఎత్తున ఆదాయం వస్తోంది. వ్యాపారులు ఏటా రూ.కోటికిపైగా లాభాన్ని ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదాయమంతా గత కొన్నేళ్లుగా పరాయి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో ఫలితంగా నగరపాలక ఆదాయానికి గండి పడుతోంది.
* వ్యర్థాలను తరలించే వ్యాపారులంతా కలిసి ఓ ప్రజాప్రతినిధికి రూ.10 లక్షల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. అనధికారికంగా ఇచ్చిన అనుమతిని రద్దు చేసి టెండర్లు పిలిస్తే నగరపాలక సంస్థకు ఆదాయం సమకూరుతుందని పలువురు కార్పొరేటర్లు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పత్తికొండలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
సెబ్ పోలీసుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సెబ్ సూపరింటెండెంట్ ఎస్.రవి కుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, అక్రమ మద్యం రవాణా అమ్మకాలపై పత్తికొండ, కర్నూలు పోలీసులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. -
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత