ఇసుక దందా కోసమే చెరువుల్లో నీరు నింపడం లేదు
వైకాపా నాయకులు ఇసుక దందా కోసమే చెరువుల్లో నీరు నింపడంలేదని నియోజకవర్గం తెదేపా బాధ్యుడు పి.తిక్కారెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో రెండు పంటలకు సాగునీరు అందించిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. సోమవారం సాయంత్రం రచ్చుమర్రి-సుంకేశ్వరి గ్రామాల మధ్య
మూతబడిన బసలదొడ్డి స్టేజ్-2 ఎత్తిపోతల పథకం వద్ద తిక్కారెడ్డి
మంత్రాలయం , న్యూస్టుడే: వైకాపా నాయకులు ఇసుక దందా కోసమే చెరువుల్లో నీరు నింపడంలేదని నియోజకవర్గం తెదేపా బాధ్యుడు పి.తిక్కారెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో రెండు పంటలకు సాగునీరు అందించిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. సోమవారం సాయంత్రం రచ్చుమర్రి-సుంకేశ్వరి గ్రామాల మధ్య నిర్మించిన బసలలదొడ్డి చెరువు, స్టేజ్-2 ఎత్తిపోతల పథకాలను నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తుంగభద్ర నీరు సముద్రంలో కలిసి వృథా అవుతుంటే నీటిని సద్వినియోగం చేసుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందన్నారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు చంద్రబాబు మానసపుత్రిక అని ఆయన అధికారంలోకి వచ్చాక పులికనుమను పూర్తి చేశారన్నారు. నియోజకవర్గంలో చెరువులు, ఎత్తిపోతల పథకాలు నిర్మించి వాటి ద్వారా రెండు పంటలకు సాగునీరు ఇచ్చారన్నారు. ప్రస్తుతం చెరువుల్లో నీరు నింపకుండా ఖాళీగా ఉంచి ఆయకట్టు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర నాయకుడు రమాకాంతరెడ్డి మాట్లాడుతూ ఉన్న ఎత్తిపోతల పథకాలకు నిధులు అక్కర్లేదని కేవలం బటన్ నొక్కితే చాలు నీరు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో పల్లెపాడు రామిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, అమర్నాథ్రెడ్డి, వగరూరు రామిరెడ్డి, చావడి వెంకటేశులు, ఆచారి, వెంకటేశులు, రఘు, చంద్ర, గోపాల్రెడ్డి, రోగప్ప పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.