logo

మందలించిన తండ్రికి మరణశాసనం

వ్యసనాలకు బానిసై చెడుదారుల్లోకి వెళ్లవద్దని మందలించిన తండ్రికి ఓ కొడుకు మరణశాసనం రాశాడు. గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన కోసిగి మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోసిగిలోని రెండో వార్డులో నివాసముంటున్న నాగన్నగేరి ఈరయ్య(45),

Published : 27 Sep 2022 03:42 IST

గొడ్డలితో హతమార్చిన తనయుడు

ఈరయ్య (పాత చిత్రం)

కోసిగి, న్యూస్‌టుడే: వ్యసనాలకు బానిసై చెడుదారుల్లోకి వెళ్లవద్దని మందలించిన తండ్రికి ఓ కొడుకు మరణశాసనం రాశాడు. గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన కోసిగి మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోసిగిలోని రెండో వార్డులో నివాసముంటున్న నాగన్నగేరి ఈరయ్య(45), అల్లమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. రెండో కుమారుడు నరసింహులు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈ విషయాన్ని కొందరు గ్రామస్థులు ఈరయ్యకు తెలిపారు. రెండ్రోజుల క్రితం ఆయన కొడుకును మందలించారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి మద్యం తాగివచ్చిన నరసింహులు ఇంట్లో నిద్రపోతున్న తండ్రిపై గొడ్డలితో దాడిచేశాడు. తీవ్రరక్తస్రావమైన ఈరయ్య అక్కడికక్కడే మృతిచెందారు. ఉదయం విషయం తెలిసిన స్థానికులు నరసింహులును కట్టేసి పోలీసులకు అప్పగించారు. సీఐ ఎరిషావలి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని