సీమ నుంచే వైకాపా ఓటమి ప్రారంభమవ్వాలి : అఖిలప్రియ
వైకాపా ఓటమి రాయలసీమ నుంచే ప్రారంభం కావాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. పట్టణంలోని తన నివాసంలో బుధవారం పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డితో కలిసి ఆమె నాయకులు,
మాట్లాడుతున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ
నంద్యాల గ్రామీణం, న్యూస్టుడే : వైకాపా ఓటమి రాయలసీమ నుంచే ప్రారంభం కావాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. పట్టణంలోని తన నివాసంలో బుధవారం పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డితో కలిసి ఆమె నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో సీమ వాసులకు వైకాపాను ఓడించే అవకాశం వచ్చిందన్నారు. తనకు 151 సీట్లు ఇచ్చిన ప్రజలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇష్టానుసారం పన్నులు పెంచుతూ అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు బుద్ధిచెప్పాలన్నారు. పట్టభద్రులందరితో ఓటు నమోదు చేయించేందుకు తెదేపా శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటు నమోదుకు అక్టోబరు 1 నుంచి నవంబరు 7వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు తమ పరిధిలోని పట్టభద్రులను గుర్తించి ఓటు నమోదు చేయించాలన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు భూమా జగత్విఖ్యాత్రెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్ ప్రసాద్, పార్లమెంటు తెదేపా ఉపాధ్యక్షులు శివశంకర్ యాదగిరి, రవీంద్ర, ఉపాధ్యాయులు, పట్టభద్రులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్యాబు జగన్ డాబు
[ 20-04-2024]
‘ట్యాబ్ల కారణంగా పిల్లలకు చదువులకు ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలు బాగా అర్థమవుతాయి. -
రెండోరోజు 6 నామపత్రాలు
[ 20-04-2024]
-
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
[ 20-04-2024]
ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులు(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా ఎస్సై ఎర్రిస్వామి శుక్రవారం తెలిపారు. -
రెండో రోజు 20 మంది
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం నామినేషన్ల పర్వం కొనసాగింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఒకరు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అభ్యర్థులు తమ నామపత్రాలు సమర్పించారు. -
గుట్టుగా ట్యాబ్ల పంపిణీ
[ 20-04-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్సాహం చూపుతున్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం ట్యాబ్ల పంపిణీ విషయం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!