అధికార పార్టీలో అలకలు
ఎమ్మిగనూరు పురపాలక పాలకవర్గంలో ముసలం పుట్టింది. ఉపాధ్యక్షుడు (వైస్ ఛైర్మన్) నజీర్ అహ్మద్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. వైస్ ఛైర్మన్ ధోరణిపై విసుగుచెంది ఈనెల 28న 15వ వార్డు కౌన్సిలర్ ఇసాక్ తన రాజీనామా పత్రాన్ని పార్టీ పెద్దలకు అందించారు.
ఎమ్మిగనూరు ఉపాధ్యక్షుడి తీరుపై పలువురు అసంతృప్తి
రాజీనామాకు సిద్ధపడిన 15వ వార్డు కౌన్సిలర్
కౌన్సిల్ సమావేశానికి 14 మంది సభ్యుల గైర్హాజరు
ఈనాడు - కర్నూలు : ఎమ్మిగనూరు పురపాలక పాలకవర్గంలో ముసలం పుట్టింది. ఉపాధ్యక్షుడు (వైస్ ఛైర్మన్) నజీర్ అహ్మద్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. వైస్ ఛైర్మన్ ధోరణిపై విసుగుచెంది ఈనెల 28న 15వ వార్డు కౌన్సిలర్ ఇసాక్ తన రాజీనామా పత్రాన్ని పార్టీ పెద్దలకు అందించారు. వారు బుజ్జగించడంతో రాజీనామా ఆలోచన విరమించుకున్నారు. ఇంతలోనే గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి వైకాపా కౌన్సిలర్లు సుమారు 14 మంది గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మిగనూరు పురపాలక పరిధిలో మంది 34 కౌన్సిలర్లు ఉండగా అందులో అధికార పార్టీకి చెందిన వారే 31 మంది ఉన్నారు. డాక్టర్ రఘును ఛైర్మన్గా, నజీర్ అహ్మద్ను వైస్ ఛైర్మన్గా ఎన్నుకున్నారు. వైస్ ఛైర్మన్కు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. పాలన వ్యవహారాల్లో ఆయన పెత్తనం బాగా పెరిగింది. దీనిపై చాలా మంది కౌన్సిలర్లు అసంతృప్తిలో ఉన్నారు.
* మున్సిపాల్టీ పరిధిలో స్థిరాస్తి వ్యాపారుల నుంచి కమీషన్లు, స్థల పంచాయితీలు, ఓ బార్ వ్యవహారంలోనూ భాగస్వామ్యం ఇవ్వడం వంటివి జీర్ణించుకోలేక కొందరు ఆది నుంచి గుర్రుగా ఉంటున్నారు.
* ఇతర వార్డుల్లోనూ వైస్ ఛైర్మన్ పెత్తనం చేయడం.. నిధుల కేటాయింపులో వివక్ష చూపడం వంటి వాటితో అధికార పార్టీ కౌన్సిలర్లలో అసంతృప్తి తారస్థాయికి చేరింది. గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్ చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ.. తన వార్డులో తాను సూచించిన పని ఏదీ జరగడం లేదు.. వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్ పెత్తనం పెరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పన్నులు ఎగ్గొట్టేందుకు
ఎమ్మెల్యే అండతో వైస్ ఛైర్మన్ తన బినామీలతో ఎమ్మిగనూరు మున్సిపాల్టీ పరిధిలో పలు సంతలకు సంబంధించి జకాయతీ వసూళ్ల వేలం దక్కించుకున్నారు. కొవిడ్ బూచిగా చూపించి సుమారు రూ.40 లక్షల డబ్బులు చెల్లించకుండా బకాయిలు పెట్టారు. వాటిని రద్దు చేయాలంటూ గత కౌన్సిల్లో తీర్మానానికి పెట్టారు. బకాయిలు చెల్లించడానికి సదరు వేలం దక్కించుకున్న గుత్తేదారుడికి అధికారులు నోటీసులిచ్చారు. గుత్తేదారు బదులు వైస్ ఛైర్మన్ కుటుంబ సభ్యుల పేరుతో సుమారు రూ.9.34 లక్షల చెక్కు ఇవ్వడం గమనార్హం. ఈ చెక్కు (నంబరు 079980) ఈ ఏడాది మార్చి 26వ తేదీ బౌన్స్ అయినట్లు తెలుస్తోంది.
69 గ్యాంగ్కు వత్తాసు
జకాయతీ వసూళ్లకు కొందరు యువకులను ఏర్పాటు చేశారు. వీరిలో కొందరు 69 గ్యాంగ్ పేరుతో పట్టణంలో ప్రజలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ గ్యాంగ్పై కేసు నమోదైంది. ఈ గ్యాంగ్కు వైస్ ఛైర్మన్, నియోజవర్గ ప్రజాప్రతినిధి వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనారిటీల అభివృద్ధిని విస్మరించిన వైకాపా
[ 24-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు. -
తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు
[ 24-04-2024]
రాష్ట్రంలో తెదేపాను గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్