రబీ విత్తనంలో కోత
అక్టోబరు ఒకటి నుంచి రబీ సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పటికీ విత్తనాల సేకరణ, సరఫరా ప్రక్రియ వేగవంతం కాలేదు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యమైన పప్పుశనగ, వేరుసెనగ విత్తనాలు తెప్పించాలని అధికారులు నిర్ణయించారు.
అక్టోబరు ఒకటి నుంచి సీజన్
పప్పుశనగ విత్తన రాయితీ 25 శాతానికి కుదింపు
సన్న, చిన్నకారు రైతులపై భారం
ఏపీ సీడ్స్ సంస్థ గోదాములో పప్పుశనగ సంచులు
కర్నూలు వ్యవసాయం, న్యూస్టుడే : అక్టోబరు ఒకటి నుంచి రబీ సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పటికీ విత్తనాల సేకరణ, సరఫరా ప్రక్రియ వేగవంతం కాలేదు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యమైన పప్పుశనగ, వేరుసెనగ విత్తనాలు తెప్పించాలని అధికారులు నిర్ణయించారు. సీజన్ ప్రారంభంకానుండటంతో రాయితీ విత్తనం కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ ఆ దిశగా చర్యలు మాత్రం కానరావడం లేదు.
43,706 క్వింటాళ్లకు ప్రతిపాదనలు
* ఉమ్మడి కర్నూలు జిల్లాలో రబీ సాధారణ సాగు 3.20 లక్షల హెక్టార్లు కాగా అందులో అత్యధికంగా పప్పుశనగ 1.63 లక్షల హెక్టార్లు, జొన్న 33 వేలు, వరి 25 వేలు, వేరుసెనగ 22,961, మొక్కజొన్న 10 వేలు, మినుము 38 వేలు, ఉల్లి 3,700, పొగాకు 500 హెక్టార్లుగా ఉంది.
* రబీ సీజన్కు సంబంధించి అన్ని రకాలు కలిపి 43,706 క్వింటాళ్ల విత్తనాల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం అందుబాటులో ఉండే 10 వేల క్వింటాళ్ల పప్పుశనగను ఎక్కువగా సాగు చేసే మండలాలకు తరలించి పంపిణీకి సిద్ధం చేయాలని ఈనెల 16న జరిగిన జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశంలో వ్యవసాయాధికారులను కర్నూలు కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. రబీలో ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలను సైతం పంపిణీకి సిద్ధం చేయాలని సూచించారు.
ఖరారు కానీ ధరలు
* అక్టోబరు 1వ తేదీ నుంచి రబీ సీజన్ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు రైతులకు రాయితీపై ఇచ్చే విత్తనాల ధరలను ఇంత వరకు ఖరారు చేయలేదు. పప్పుశనగను 25 శాతం రాయితీపై, వేరుసెనగ విత్తన కాయలను 40 శాతం రాయితీపై పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయాధికారులకు ఆదేశాలు వచ్చాయి. క్వింటా ధర ఎంత.. రాయితీ పోనూ రైతు నాన్ సబ్సిడీ కింద ఎంత మొత్తం చెల్లించాలనేది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవసాయశాఖ నుంచి ఆదేశాలు రాలేదు.
* బహిరంగ మార్కెట్లో పప్పుశనగ క్వింటా రూ.5,000 లోపు ఉంది. వేరుసెనగ క్వింటా రూ.7,000-రూ.7,500 ధర పలుకుతోంది. రాయితీ తగ్గడంతో రైతులకు విత్తనాలు, పెట్టుబడి భారం కానుంది.
ముందస్తుగా అందించాలన్నా...
జిల్లాలో అందుబాటులో ఉన్న 10 వేల క్వింటాళ్ల పప్పుశనగ విత్తనాన్ని ఆయా మండలాలకు ముందస్తుగా సరఫరా చేయాలని ఆదేశించి రెండు వారాలు గడిచినా ఇప్పటి వరకు 2 వేల క్వింటాళ్లు కూడా ఆయా మండలాలకు చేరలేదు. మొదట 20 కిలోల విత్తనం ఇవ్వాలని నిర్ణయించారు.. ఆ తర్వాత దానిని 25 కిలోలకు పెంచారు. ఉమ్మడి జిల్లాకు సరిపడే విత్తనం ఏపీ సీడ్స్ దగ్గర అందుబాటులో లేదన్న విమర్శలున్నాయి. రెండు జిల్లాలకు కలిపి 17,300 క్వింటాళ్ల విత్తనం అందుబాటులో ఉందని చెబుతున్నారు తప్ప ఆయా మండలాలకు అందులో సగం కాదు కదా.. 1,600 క్వింటాళ్లే ముందస్తు పొజిషన్ చేయడంపై నిర్దేశించిన లక్ష్యం మేరకు విత్తనం లేదని తేటతెల్లమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు