logo

అక్టోబరు 14న చంద్రబాబు పర్యటన

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల అక్టోబరు 14న కర్నూలులో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి కర్నూలు పార్లమెంట్‌ తెదేపా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 30 Sep 2022 01:37 IST

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల అక్టోబరు 14న కర్నూలులో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి కర్నూలు పార్లమెంట్‌ తెదేపా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.హైదరాబాద్‌ నుంచి పుట్టపర్తికి విమానంలో చేరుకుని అనంతపురంలో 12న నిర్వహించే మినీ మహానాడులో పాల్గొంటారు. అనంతరం 13న పుట్టపర్తిలో నేతలతో సమీక్షించి గుత్తి నుంచి రోడ్డు మార్గంలో పత్తికొండ రానున్నారు. పత్తికొండతోపాటు, మంత్రాలయం (కోసిగి) లేదా ఎమ్మిగనూరులో పర్యటించే అవకాశం ఉందని కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. 13న సాయంత్రం పత్తికొండలో పర్యటించి అక్కడ రాత్రి బస చేస్తారా? లేక పుట్టపర్తిలోనే 13న రాత్రి బస చేసి 14న ఉదయం పత్తికొండ, సాయంత్రం మంత్రాలయం, ఎమ్మిగనూరులో ఓ చోట రోడ్‌ షో చేస్తారా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. - ఈనాడు, కర్నూలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని