మహాత్మా మన్నించు
గ్రామ స్వరాజ్యం సాధనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకమైంది. ఈ వ్యవస్థకు దిశానిర్దేశం చేసేది సర్పంచులు, ప్రజాప్రతినిధులు. గ్రామీణాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది
సర్పంచుల ఆవేదన
పడకేసిన పల్లె ప్రగతి
నిధుల్లేక ఏం చేయలేకపోతున్నామని గాంధీ విగ్రహానికి విన్నవిస్తున్న సర్పంచులు (పాత చిత్రం)
గ్రామ స్వరాజ్యం సాధనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకమైంది. ఈ వ్యవస్థకు దిశానిర్దేశం చేసేది సర్పంచులు, ప్రజాప్రతినిధులు. గ్రామీణాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది
- మహాత్మా గాంధీ
గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలో సర్పంచులు గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలపాలని పిలుపు ఇస్తున్నట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్రెడ్డి ప్రకటించారు.
పల్లె ప్రగతిలో సర్పంచుల పాత్ర కీలకం. కేంద్రం మంజూరు చేసిన ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీలు పన్నుల రూపంలో సమీకరించుకున్న సాధారణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకుంది. దీంతో పంచాయతీ ఖజానాలో అణా పైసా లేదు. చేసేది లేక సర్పంచులు నిధులకు భిక్షాటన చేస్తున్నారు. మండల సభలో ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు విన్నవిస్తున్నారు. స్పందన లేకపోవడంతో ఏం చేయలేకపోతున్నారు. పల్లెల్లో వీధి దీపం వెలగడం లేదు.. మంచినీటి ట్యాంకుల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది.. మురుగు పేరుకుపోయి దోమలు జనాల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితులు తలెత్తాయని పల్లె ప్రథమ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనం ఏకమై జలం తెచ్చుకుని
ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్లలో మందలూరు రహదారిలోని బీసీ కాలనీలో నీటి సమస్య ఏర్పడింది. బోరు మరమ్మతులకు గురికావడంతో వారం రోజుల నుంచి నీటి సరఫరా కావడం లేదు. ఆ కాలనీలోని 30 కుటుంబాలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. నిధులు లేకపోవడంతో మరమ్మతులు చేయలేక గ్రామ సర్పంచి చేతులెత్తేశారు. దీంతో సమస్య పరిష్కరించుకునేందుకు కాలనీవాసులంతా ఏకమయ్యారు. గుర్రప్ప యాదవ్, ప్రభాకర్, సురేష్, సుబ్బన్న, శేషయ్య, నాగరాజు, రాముడు, లింగమయ్యతోపాటు మరికొందరు చందాలు సేకరించి బోరుకు మరమ్మతులు చేయించారు.
పల్లె ఖాతాల్లో సున్నా నిధులు
ప్రస్తుతం జిల్లాలోని అన్ని పంచాయతీ ఆర్థిక సంఘ ఖాతాల్లో నిధులు సున్నా కాగా, పన్నుల రూపంలో (సాధారణ నిధులు ) వసూలు చేసిన అరకొర నిధులున్నాయి. వీటితో ఏం చేయలేకపోతున్నాం.. నిధులు మంజూరు చేయాలని ఇటీవల కొలిమిగుండ్ల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికినంద్యాల జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు విన్నవించారు.
సొంతంగా రూ.కోటి ఖర్చు
ఆదోని మండలం పెద్దహరివాణానికి రూ.16 లక్షల వరకు ఆర్థిక సంఘం నిధులొచ్చాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సర్పంచి రామన్న ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 7 సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు, మట్టి రోడ్లు నిర్మించారు. ఉపాధి హామీ, పంచాయతీ నిధుల అనుసంధానంతో చేపట్టిన ఈ పనుల విలువ అక్షరాలా రూ.కోటి వరకు ఉంటుంది. ఇప్పటి వరకు బిల్లులు మంజూరు కాలేదు. నెలకు రూ.2 లక్షల వరకు వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ అంశంపై ఇటీవల జరిగిన మండల పరిషత్ సభలో ఆందోళన వ్యక్తం చేశారు.
అప్పు తెచ్చి.. సమస్య తీర్చి
గోనెగండ్ల మండలం అగ్రహారం పంచాయతీకి రూ.40 లక్షలొచ్చాయి. వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మంచినీటి సమస్య తీర్చాలని ప్రజలు ఒత్తిడి చేయడంతో సర్పంచి రంగారెడ్డి రూ. 5 లక్షలు అప్పు తీసుకొచ్చి పనులు చేయించారు.
విధిలేక స్థలం విక్రయం
కోడుమూరు మండలం లద్దగిరి పంచాయతీ పరిధిలో సుమారు రూ.30 లక్షల ఆర్థిక సంఘ నిధులను ప్రభుత్వం తీసుకుంది. దీంతో పంచాయతీ పరిధిలో మౌలిక వసతుల కల్పన కష్టతరమైంది. తాగునీరు అందడం లేదని గ్రామస్థులు స్పందనలో ఏకరవు పెట్టారు. చేసేది లేక సర్పంచి హనుమంతు కర్నూలులో తనకున్న నాలుగు సెంట్ల స్థలాన్ని విక్రయించి సమస్యలు పరిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ఆటలు ఇక సాగవు..
[ 19-04-2024]
తెదేపా ఇంటింటి ప్రచారంలో భాగంగా కౌతాళం మండలం నందు బంటకుంటా గ్రామంలో ప్రతి ఇంటింటికీ వెళ్ళి జగన్ చేస్తున్న, అరాచకాలు, దోపిడి, దౌర్జన్యాలు, వివరిస్తూ, 2019లో కోడికత్తి, ఈసారి గులక రాయి అంటున్నాడని తెదేపా నేతలు పేర్కొన్నారు. -
ఇంటిఇంటికి తెలుగుదేశం
[ 19-04-2024]
ఇంటిఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, ఆయన సోదరులు రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న పాల్గొన్నారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
[ 19-04-2024]
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్