దైవకార్యానికి కఠోర దీక్ష
జిల్లాలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాలు గత నెల 30న కంకణధారణ కార్యక్రమంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. దసరా అమావాస్య వస్తుందంటే మండలంలోని హొళగుంద మండలంలోని నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తుల్లో నిష్ఠ, నిబద్ధత నెలకొంటుంది.
బన్ని ఉత్సవాలు ముగిసే వరకు నిష్ఠ, నిబద్ధత
ప్రత్యేకత చాటుకుంటున్న మూడు గ్రామాల వాసులు
- న్యూస్టుడే, హొళగుంద
నెరణికిలో కొలువైన ఉత్సవమూర్తులు
జిల్లాలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాలు గత నెల 30న కంకణధారణ కార్యక్రమంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. దసరా అమావాస్య వస్తుందంటే మండలంలోని హొళగుంద మండలంలోని నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తుల్లో నిష్ఠ, నిబద్ధత నెలకొంటుంది. ఆ మూడు గ్రామాల భక్తులు కులమతాలకు అతీతంగా కఠోర దీక్షకు శ్రీకారం చుడతారు.
* హొళగుంద మండలంలోని నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దసరా బన్ని ఉత్సవాలు ప్రారంభానికి ముందే ఆయా గ్రామాల ప్రజలు మద్యం, మాంసం, ఇతర అంశాలకు దూరంగా ఉండటంతోపాటు కటిక నేలపైనే నిద్రపోతారు. బన్ని ఉత్సవాలు ముగిసే వరకు గ్రామస్థులెవరూ 15 రోజుల పాటు కాళ్లకు చెప్పులు సైతం ధరించరు. ఉత్సవమూర్తులను తిరిగి దక్కించుకోవడానికి తామంతా ఏకతాటిపై నిలిచి కలిసికట్టుగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తారు. ఏ ప్రలోభాలనూ దరిచేరనివ్వకుండా దైవకార్యమే ప్రధాన లక్ష్యమని విశ్వసిస్తారు. నెరణికిలో కొలువై ఉండే స్వామివారి ఉత్సవమూర్తులు దేవరగట్టుకు తరలించడంతోపాటు వాటిని బన్ని ఉత్సవాలు ముగిసిన తర్వాత గ్రామానికి చేర్చే వరకు ప్రజలంతా ఈ కట్టుబాట్లు పాటిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది.
భక్తులెవరూ కొట్టుకోరు
- రవి, నెరణికి
దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో మా మూడు గ్రామాలకు చెందిన భక్తులెవరూ కర్రలతో కొట్టుకోరు. ఉత్సవాలు ప్రారంభానికి ముందే ప్రజలంతా మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. దీంతో వారిలో మంచి, చెడు ఆలోచించే విజ్ఞత వస్తుంది. కొంతమంది తాగి వచ్చి ఉద్దేశపూర్వకంగా కొట్టుకోవడం వల్ల బన్ని జైత్రయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంటోంది. మేము ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేందుకు కృషి చేస్తున్నాం.
తాగొచ్చిన కొందరి వల్లేఇబ్బందులు
- మరిమల్ల, నెరణికి
దశాబ్దాలుగా పెద్దలు పాటించిన ఆచారాలకు కట్టుబడి మూడు గ్రామాల ప్రజలు నడుచుకుంటున్నాం. బన్ని ఉత్సవాల్లో ఆయా గ్రామాల భక్తులెవరూ కర్రలతో కొట్టుకోరు. ఇతర ప్రాంతాల నుంచి తాగొచ్చిన కొందరి వల్ల ఇబ్బందులు తప్పటం లేదు. ఫలితంగా మా మూడు గ్రామాల భక్తులకు చెడ్డపేరు వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 28-03-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. -
పాదయాత్ర మాటపాలనలో జూట
[ 28-03-2024]
ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో పల్లెలకొచ్చారు.. నా అక్కాచెల్లెమ్మలు, అన్నలు అంటూ ‘హామీ’లు కురిపించారు.. ఒక సంవత్సరం ఓపిక పడితే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించారు.. జగన్ వస్తే జనాలకు మంచి జరుగుతుందని భ్రమింపజేశారు.. అధికార పీఠమెక్కి ‘ప్రజా’స్వామ్యం మరిచారు.. అడిగితే అణచివేశారు.. ప్రశ్నిస్తే భయపెట్టారు.. -
ఎమ్మెల్యే కబ్జాలో రూ.4 కోట్ల విలువైన స్థలం
[ 28-03-2024]
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కె.వి.కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. -
బస్సులు మళ్లించారు..ఎండలో నిలబెట్టారు
[ 28-03-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే జనం హడలిపోతున్నారు. -
మఠం స్థలానికి ఎసరు
[ 28-03-2024]
ఆదోని పట్టణ శివారులోని బైపాస్ రహదారిపై మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో కల్లుమఠానికి చెందిన రూ.కోట్లు విలువ చేసే భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా పర్వానికి తెర లేపారు. -
ఆదోని భాజపా అభ్యర్థి డా.పార్థసారథి
[ 28-03-2024]
ఉత్కంఠ వీడింది.. ఆదోని అభ్యర్థిగా భాజపా ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారథి బరిలో ఉండనున్నారు. -
29న బనగానపల్లికి చంద్రబాబు రాక
[ 28-03-2024]
బనగానపల్లికి ఈ నెల 29న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి బుధవారం తెలిపారు. -
కేసులు నమోదైతే కొలువు కష్టమే
[ 28-03-2024]
చట్ట నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వాలంటీర్లపై కేసులు నమోదైతే మళ్లీ వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. -
తెదేపాలోనే బీసీలకు పెద్దపీట
[ 28-03-2024]
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చట్టసభలో సీట్లు కేటాయించి అత్యున్నత స్థానం కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. -
వైకాపా అరాచక పాలనలో ఇబ్బందులు
[ 28-03-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. -
ఉర్దూ వర్సిటీ పనులు పూర్తి చేయాలి
[ 28-03-2024]
ఓర్వకల్లు సమీపంలో తెదేపా హయాంలో చేపట్టిన ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
[ 28-03-2024]
ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దఎత్తున హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు కోరారు. -
అభివృద్ధికి ఓటేయండి
[ 28-03-2024]
కర్నూలును అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ అన్నారు. -
తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా పోటీ చేస్తా
[ 28-03-2024]
మంత్రాలయం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా నేనే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు తిక్కారెడ్డి అన్నారు. -
ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
[ 28-03-2024]
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాస్టిక్ నవీన్కుమార్, అతని సోదరుడు అరుణ్కుమార్, అదే గ్రామానికి చెందిన మహేశ్ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ