logo

ఇష్టం లేని పెళ్లి చేస్తారని విద్యార్థి ఆత్మహత్య

మండలంలోని మీర్జాపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి అనిల్‌ కుమార్‌ (24) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రమేశ్‌రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన బాలాంజనేయులు, వెంకటలక్ష్ముమ్మ దంపతుల పెద్ద కుమారుడు అనిల్‌కుమార్‌

Published : 02 Oct 2022 01:56 IST

అనిల్‌ కుమార్‌ (పాతచిత్రం)

మీర్జాపురం (కొలిమిగుండ్ల), న్యూస్‌టుడే: మండలంలోని మీర్జాపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి అనిల్‌ కుమార్‌ (24) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రమేశ్‌రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన బాలాంజనేయులు, వెంకటలక్ష్ముమ్మ దంపతుల పెద్ద కుమారుడు అనిల్‌కుమార్‌ అనంతపురం జిల్లా తాడిపత్రిలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గ్రామంలో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు గ్రామస్థులు తెలిపారు. తల్లిదండ్రులు కుమారునికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. వీరి బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నారు. అమ్మాయి చదువుకోలేదని, ఆమెను చేసుకోవడం అనిల్‌కుమార్‌కు ఇష్టం లేదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఆ అమ్మాయితోనే పెళ్లి చేస్తారని, ప్రేమించిన అమ్మాయి దక్కదన్న కారణంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు తాడిపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని