ఆటోను ఢీకొన్న కారు, ద్విచక్ర వాహనం
చిన్నారి తలనీలాలు సమర్పించడానికి ఆలయానికి వచ్చిన ఓ కుటుంబం వారు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలో చోటు చేసుకుంది.
పలువురికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
ఘటనా స్థలంలో దెబ్బతిన్న ఆటో, ద్విచక్రవాహనం, రోడ్డుపైనే క్షతగాత్రులు
మహబూబ్నగర్ నేర విభాగం : చిన్నారి తలనీలాలు సమర్పించడానికి ఆలయానికి వచ్చిన ఓ కుటుంబం వారు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలో చోటు చేసుకుంది. పందిపాడు గ్రామానికి చెందిన అరుణ, రామ్మోహన్ గౌడ్ దంపతులు ఆదివారం తమ కుమారుడు పుట్టు వెంటుక్రలు తీసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో బయలుదేరారు. మహబూబ్నగర్ సమీప మన్యంకొండ దేవస్థానానికి చేరుకని తలనీలాలు సమర్పించారు. మధ్యాహ్నం ఆటోలో తిరుగు పయనమయ్యారు. ఓబ్లాయిపల్లి వద్ద రాగానే దేవరకద్ర నుంచి వస్తున్న విశాఖపట్టణానికి చెందిన కారు ఓవర్టేక్ చేసే క్రమంలో ఆటోను ఢీకొట్టింది. వెనుక వస్తున్న ద్విచక్రవాహనం కూడా ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 108 సిబ్బంది క్షతగాత్రులను మహబూబ్నగర్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వరుణ్గౌడ్, సంజీవ్, గణేశ్లను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా