logo

‘రాష్ట్ర బాగోగులు సీఎంకు పట్టవా’

రాష్ట్ర సంపదనంతా ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రం బాగోగులు పట్టడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు, భాజపా నాయకుడు టి.జి.వెంకటేశ్‌ అన్నారు. ఆదివారం ప్రజాపోరు చివరి సమావేశంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి వివరించారు.

Published : 03 Oct 2022 01:51 IST

మాట్లాడుతున్న మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్‌

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: రాష్ట్ర సంపదనంతా ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రం బాగోగులు పట్టడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు, భాజపా నాయకుడు టి.జి.వెంకటేశ్‌ అన్నారు. ఆదివారం ప్రజాపోరు చివరి సమావేశంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి వివరించారు. నగరంలోని పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీజీ మాట్లాడుతూ రాష్ట్ర సంపద, ప్రజల ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. దేశంలో కొవిడ్‌ వచ్చిన తర్వాత ఇప్పటివరకు అందరికీ రేషన్‌ పంపిణీ చేసిన ఘనత ప్రధానమంత్రి మోదీకే దక్కిందన్నారు. ప్రజలకు భాజపాకు అధికారం ఇస్తే ఎన్నో మేలైన కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పొలంకి రామస్వామి, సీనియర్‌ నాయకుడు కపిలేశ్వరయ్య, నగరూరు రాఘవేంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని