బార్లా తెరిచారు
ఉమ్మడి జిల్లాలో బార్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం సమయపాలన పాటించటం లేదు. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే బార్లు నడుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 49 బార్లు, 162 మద్యం దుకాణాలు ఉన్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిర్వాహకులు
కర్నూలు నేరవిభాగం, నంద్యాల నేరవిభాగం, న్యూస్టుడే : ఉమ్మడి జిల్లాలో బార్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం సమయపాలన పాటించటం లేదు. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే బార్లు నడుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 49 బార్లు, 162 మద్యం దుకాణాలు ఉన్నాయి. సగటున ప్రతిరోజూ రూ.3.5 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో పరిశీలిస్తే (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు) వరకు రూ.636 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త అనుమతులతో బార్లు ప్రారంభమయ్యాయి.కర్నూలులో 18కుగాను 14 బార్లను పాత వ్యాపారులు దక్కించుకోవటంతో యథాస్థానంలో కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే బార్లు నిర్వహించాల్సి ఉండగా కొందరు ఉదయాన్నే తెరిచి అర్ధరాత్రి వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పోటీపడి అధిక మొత్తానికి అనుమతి దక్కించుకున్న నేపథ్యంలో పెట్టుబడితోపాటు లాభాలను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పర్యవేక్షణ అంతంతే..
మద్యనిషేధ, అబ్కారీ శాఖ ఉమ్మడి జిల్లాలో ఏడుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 22 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 43 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. సిబ్బంది తక్కువగా ఉండటంతో వీటిపై దృష్టి సారించలేని పరిస్థితి. ప్రభుత్వ మద్యం దుకాణాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో బార్ల నిర్వహణపై దృష్టి సారించటం లేదు. పలు బార్లలో కొందరు నేతలు భాగస్వాములుగా ఉండటంతో వాటిపైపు చూసే ధైర్యం చేయలేకపోతున్నారు. దీనికితోడు బాహాటంగా చెప్పకున్నా మద్యం అమ్మకాలు పెంచాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉండటంతో పట్టించుకోవటం లేదన్న అభిప్రాయం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!