దుష్ట సంహారిణి.. భక్తజన సంరక్షిణి
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక సందడి మిన్నంటుతోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి కాళరాత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. జుట్టు విరబోసుకుని, చతుర్భుజాలు కలిగిన అమ్మవారి రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
గజ వాహనంపై విహరిస్తున్న పార్వతీ.. పరమేశ్వరులు
శ్రీశైలం ఆలయం, న్యూస్టుడే : శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక సందడి మిన్నంటుతోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి కాళరాత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. జుట్టు విరబోసుకుని, చతుర్భుజాలు కలిగిన అమ్మవారి రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ దేవి దుష్టులను శిక్షించి భక్త జనులను రక్షించే శుభంకరిగా పేరుగాంచింది. ఆలయంలో ప్రత్యేక వేదికపై కొలువుదీరిన కాళరాత్రి అమ్మవారికి అర్చకులు, వేదపండితులు విశేష పూజలు చేశారు. అక్క మహాదేవి అలంకార మండపంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను గజ వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను గ్రామోత్సవానికి తీసుకురాగా ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, సభ్యులు, ఈవో ఎస్.లవన్న కర్పూర హారతులు ఇచ్చి నారికేళాలు సమర్పించారు. కళాకారులు కోలాటాలు, చెక్కభజనలు, ఢమరుక విన్యాసాలతో ఆకట్టుకున్నారు. కన్నడ యువతులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ దక్షిణ మాడవీధిలో కళాకారులు సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. నాదస్వరం, భక్తిరంజని కార్యక్రమాలు అలరించాయి.
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీభ్రమరాంబాదేవి మహాగౌరి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. రాత్రి 8 గంటలకు స్వామి, అమ్మవార్లకు నందివాహనసేవ జరగనుంది. ఆలయంలో పూజల అనంతరం శ్రీగిరి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
కాళికా వేషధారణలో కళాకారిణి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
-
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్