అధికారంలో ఆధిపత్య పోరు
అధికార పార్టీలో ఆధిపత్య పోరు రగులుతోంది. నియోజకవర్గాల్లో పెత్తనం కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. తాజాగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని కర్నూలు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ఆధిపత్య పోరే కారణమని తెలుస్తోంది.
బాలనాగిరెడ్డి మార్పుతో బహిర్గతం
ఈనాడు - కర్నూలు: అధికార పార్టీలో ఆధిపత్య పోరు రగులుతోంది. నియోజకవర్గాల్లో పెత్తనం కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. తాజాగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని కర్నూలు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ఆధిపత్య పోరే కారణమని తెలుస్తోంది. ఇసుక, మద్యం, భూ దందాలు, పదవులు.. ఇలా ప్రతిదాంట్లో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. కర్నూలు, నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఇద్దరేసి నాయకులుండటం.. వారి మధ్య సఖ్యత కుదరడం లేదు.
కర్నూలులో నువ్వా.. నేను
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి వర్గాల మధ్య మూడున్నరేళ్లుగా వర్గ పోరు నడుస్తోంది. తాజాగా దీపావళి టపాసుల దుకాణాల ఏర్పాటు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఎస్వీ మోహన్రెడ్డి ఓ హోటల్ అధినేత పేరుతో ఉపగుత్తకు దక్కించుకున్నారు. ఈ విషయం కోడుమూరు, కర్నూలు, పాణ్యం, మంత్రాలయం నియోజకవర్గాల నేతలకు మింగుడు పడలేదు. గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేరోదారిలో వెళ్లారు. ఫ్లెక్సీల ఏర్పాటులో వివాదాలు, సభలు, సమావేశాలు, పార్టీ జెండా ఆవిష్కరణలలో కొట్టుకునే స్థాయికి వెళ్లారు.
ఎమ్మిగనూరులో ఏం జరిగింది
వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి పోటీ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వయసు మీదపడటంతో ఆ సీటు మాకిస్తే గెలుచుకొస్తామంటూ కొందరు అమరావతి స్థాయిలో పావులు కదుపుతున్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన కుమారుడిని పోటీలో నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఎమ్మిగనూరులో ఇల్లు నిర్మించుకున్నారు. అక్కడ భూ పంచాయితీలు, సెటిల్మెంట్లు తన కుమారుడు ధరణీరెడ్డితోనే చేయిస్తున్నారు. నందవరంలో ఓ వర్గాన్ని తయారు చేశారు. ఇవన్నీ స్థానికంగా బలం పెంచుకోవడానికేనని తెలుస్తోంది. బాలనాగిరెడ్డి కుటుంబం మద్దతు తీసుకోవాలని 2019 ఎన్నికల సమయంలో జగన్ కోరారు. ఓటమి అయినా.. గెలుపైనా తనదే బాధ్యతంటూ చెన్నకేశవరెడ్డి తేల్చి చెప్పారు. ఇలా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు చాలా కాలం నుంచి నడుస్తోంది. చేనేతలు ఎక్కువగా ఉన్నారు.. కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం ఇవ్వాలంటూ మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రయత్నాలు చేస్తున్నారు.
కోడుమూరులో కొట్లాట....
కోడుమూరు సమన్వయకర్త కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్రెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్ మధ్య విభేదాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సుధాకర్కు టిక్కెట్ ఇస్తే పార్టీకి పని చేయలేమని కోడుమూరు, సి.బెళగల్, గూడూరుకు చెందిన వైకాపా నాయకులు జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. వారంతా కోట్ల హర్షవర్ధన్రెడ్డి వర్గం కావడం గమనార్హం. కోడుమూరు పట్టణంతోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గడప-గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, కొందరు ఎంపీటీసీలు ఎమ్మెల్యేతో తిరగలేదు.
ఎమ్మెల్సీ కోసం పావులు
అవుకు ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి మరణంతో పదవీ కాలం నాలుగు నెలలు మిగిలిపోయింది. ఈ పదవి భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మికి ఇచ్చే అవకాశాలున్నా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. అయితే తర్వాత వచ్చే ఎమ్మెల్సీ పదవి కోసం నేతలు ప్రయత్నం చేస్తున్నారు. మాజీ జడ్పీ ఛైర్మన్ మల్కిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నాలు సాగిస్తుండగా, శిల్పా వర్గం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
బైరెడ్డి... ఆర్థర్
నందికొట్కూరు సమన్వయకర్త, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ వర్గాల మధ్య ఆది నుంచి విభేదాలు ఉన్నాయి. గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బైరెడ్డి వర్గం పట్టణంలో ఎమ్మెల్యే వెంట నడవలేదు. మార్కెట్ ఛైర్మన్ పదవి సిద్ధార్థరెడ్డి ఒకరిని ఎంపిక చేయగా ఎమ్మెల్యే తన వర్గానికి ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు ఓటు వేయాలి
[ 28-03-2024]
నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వై. బాలనాగిరెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావాలని వైకాపా యువ నాయకురాలు ప్రియాంక రెడ్డి అన్నారు. -
శ్రీశైలంలో వైకాపాకు మరో షాక్
[ 28-03-2024]
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో అధికార వైకాపాకు మరో షాక్ తగిలింది. -
కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమం
[ 28-03-2024]
మండలం కేంద్రమైన కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని తెదేపా నాయకులు నిర్వహించారు. -
అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు
[ 28-03-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో గురువారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
కేంద్ర బలగాల కవాతు
[ 28-03-2024]
ఆదోని పట్టణంలో కర్నూల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ శివ నారాయణస్వామి ఆధ్వర్యంలో గురువారం కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 28-03-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. -
పాదయాత్ర మాటపాలనలో జూట
[ 28-03-2024]
ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో పల్లెలకొచ్చారు.. నా అక్కాచెల్లెమ్మలు, అన్నలు అంటూ ‘హామీ’లు కురిపించారు.. ఒక సంవత్సరం ఓపిక పడితే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించారు.. జగన్ వస్తే జనాలకు మంచి జరుగుతుందని భ్రమింపజేశారు.. అధికార పీఠమెక్కి ‘ప్రజా’స్వామ్యం మరిచారు.. అడిగితే అణచివేశారు.. ప్రశ్నిస్తే భయపెట్టారు.. -
ఎమ్మెల్యే కబ్జాలో రూ.4 కోట్ల విలువైన స్థలం
[ 28-03-2024]
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కె.వి.కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. -
బస్సులు మళ్లించారు..ఎండలో నిలబెట్టారు
[ 28-03-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే జనం హడలిపోతున్నారు. -
మఠం స్థలానికి ఎసరు
[ 28-03-2024]
ఆదోని పట్టణ శివారులోని బైపాస్ రహదారిపై మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో కల్లుమఠానికి చెందిన రూ.కోట్లు విలువ చేసే భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా పర్వానికి తెర లేపారు. -
ఆదోని భాజపా అభ్యర్థి డా.పార్థసారథి
[ 28-03-2024]
ఉత్కంఠ వీడింది.. ఆదోని అభ్యర్థిగా భాజపా ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారథి బరిలో ఉండనున్నారు. -
29న బనగానపల్లికి చంద్రబాబు రాక
[ 28-03-2024]
బనగానపల్లికి ఈ నెల 29న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి బుధవారం తెలిపారు. -
కేసులు నమోదైతే కొలువు కష్టమే
[ 28-03-2024]
చట్ట నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వాలంటీర్లపై కేసులు నమోదైతే మళ్లీ వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. -
తెదేపాలోనే బీసీలకు పెద్దపీట
[ 28-03-2024]
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చట్టసభలో సీట్లు కేటాయించి అత్యున్నత స్థానం కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. -
వైకాపా అరాచక పాలనలో ఇబ్బందులు
[ 28-03-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. -
ఉర్దూ వర్సిటీ పనులు పూర్తి చేయాలి
[ 28-03-2024]
ఓర్వకల్లు సమీపంలో తెదేపా హయాంలో చేపట్టిన ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
[ 28-03-2024]
ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దఎత్తున హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు కోరారు. -
అభివృద్ధికి ఓటేయండి
[ 28-03-2024]
కర్నూలును అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ అన్నారు. -
తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా పోటీ చేస్తా
[ 28-03-2024]
మంత్రాలయం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా నేనే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు తిక్కారెడ్డి అన్నారు. -
ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
[ 28-03-2024]
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాస్టిక్ నవీన్కుమార్, అతని సోదరుడు అరుణ్కుమార్, అదే గ్రామానికి చెందిన మహేశ్ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్