logo

ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచార యత్నం?

నంద్యాల పట్టణ శివారులోని వెంకటేశ్వరాపురం సమీపంలో శనివారం రాత్రి ఓ ప్రేమజంటపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడినట్లు సమాచారం.

Published : 27 Nov 2022 02:12 IST

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే : నంద్యాల పట్టణ శివారులోని వెంకటేశ్వరాపురం సమీపంలో శనివారం రాత్రి ఓ ప్రేమజంటపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఆ జంట పాణ్యం నుంచి నంద్యాలకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో నలుగురు వ్యక్తులు వారిని ఆపి దాడి చేసినట్లు తెలిసింది. యువతి గొంతుపై కత్తి పెట్టి లాక్కెళ్లే ప్రయత్నం చేయగా.. యువకుడు బిగ్గరగా కేకలు వేయడంతో దారిన వెళ్లే వాహనదారులు వాహనాలు ఆపారు. దీంతో దుండగులు వారిని వదిలేసి పరారయ్యారని సమీప ప్రజలు చెబుతున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడంతో పట్టణంలో చర్చనీయాంశమైంది. దీనిపై సంబంధిత పోలీసు అధికారులు, ఆసుపత్రిని సిబ్బందిని వివరణ కోరగా.. తమ దృష్టికి రాలేదని తెలిపారు. పోలీసులు పట్టణ శివారులో, ఆసుపత్రుల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని