logo

రాఘవుడి సన్నిధిలో వీఐపీలు..

రాఘవేంద్రస్వామి దర్శనార్థం వేర్వేరు సమయాల్లో ప్రముఖులు మంత్రాలయానికి చేరుకున్నారు.

Updated : 27 Nov 2022 03:58 IST

జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎన్‌.శ్రీనివాసరావుకు స్వాగతం పలుకుతున్న ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు

మంత్రాలయం, న్యూస్‌టుడే: రాఘవేంద్రస్వామి దర్శనార్థం వేర్వేరు సమయాల్లో ప్రముఖులు మంత్రాలయానికి చేరుకున్నారు. జిల్లా న్యాయమూర్తి ఎన్‌.శ్రీనివాసరావు, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ముదుగళ్‌లు వచ్చారు. మఠం అధికారులు వీరికి స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం స్వామి దర్శనానికి వెళ్లనున్నారు. రాత్రి మఠం వసతి గదుల్లో బసచేస్తారు. కర్నూలు పార్లమెంటు తెదేపా బాధ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మఠానికి వచ్చారు. గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని