రెప్పపాటులో ముప్పు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 44వ నంబరు జాతీయ రహదారి 84 కి.మీ. మేర వెళ్తుంది. కర్నూలు నుంచి ప్యాపిలి మండలం పోతులదొడ్డి వరకు ఇది ఉంది.
కానరాని అండర్ పాస్లు
బ్లాక్ స్పాట్లు గుర్తించినా నియంత్రణ కరవు
ప్రమాదకరంగా రహదారి దాటుతూ...
డోన్, న్యూస్టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 44వ నంబరు జాతీయ రహదారి 84 కి.మీ. మేర వెళ్తుంది. కర్నూలు నుంచి ప్యాపిలి మండలం పోతులదొడ్డి వరకు ఇది ఉంది. ఈ మార్గంలో పలు ప్రాంతాల్లో అండర్ పాస్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు దాటాల్సి రావడం.. ప్రమాదాలు నిత్యకృత్యమవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. అండర్ పాస్లు ఏర్పాటుచేయాలంటూ గతంలో పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకునేవారే కరవయ్యారని పలువురు పేర్కొన్నారు.
పకడ్బందీ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం
ఉమ్మడి జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై పలుచోట్ల ప్రమాదకరమైన ప్రాంతాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు బ్లాక్ స్పాట్లు సైతం గుర్తించారు. నిత్యం ప్రమాదాలు జరిగే ప్రధాన ప్రాంతాల్లో డ్రమ్ములు అడ్డంగా ఏర్పాటు చేసి వేగ నియంత్రణకు చర్యలు చేపట్టినా అవి మూన్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. పెట్టిన కోద్దిరోజులకే వాహనాలు డ్రమ్ములను ఢీకొడుతుండటంతో పక్కన పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి ఉంది.
ప్రమాదకరమైన ప్రాంతాలివే..
* కర్నూలు నుంచి డోన్ వెళ్లే ప్రాంతంలో లక్ష్మీపురం సమీపంలో ఉన్న క్రాస్ వద్ద ఎక్కువగా వాహనాలు అటు.. ఇటు వెళ్తుంటాయి. ఇక్కడ మూడేళ్ల కాలంలో పదుల సంఖ్యలో జనం గాయపడగా.. ఇద్దరు మృతి చెందారు.
* దూపాడు వద్ద ప్రధానంగా అవతలి వైపున కళాశాలలు ఉండటంతో విద్యార్థులు జాతీయ రహదారిని దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పలుమార్లు ప్రమాదాలబారిన పడ్డారు.
* వెల్దుర్తి ప్రాంతంలో మలుపు వద్ద నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడినుంచి ప్రధానంగా అవతలి వైపునకు వెళ్లేందుకు కోడుమూరు రహదారి ఉండటం, కొద్ది దూరం వెళ్తే చెరుకులపాడు రహదారి ఉండటంతో జాతీయ రహదారి దాటాల్సిన పరిస్థితి. ఇక్కడ మూడేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో 17 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
* డోన్ నుంచి దొరపల్లె.. మల్లెంపల్లె మీదుగా కృష్ణగిరి మండలంలోని పలు గ్రామాలకు వెళ్లేందుకు దొరపల్లె వంతెన సమీపంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రహదారి దాటాలి. ఇక్కడ ఈ మూడేళ్ల కాలంలో 8 మంది వరకు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఏడాది ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇక్కడ రైల్వే వంతెన వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు విన్నవిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
* డోన్ మండలంలోని ఓబులాపురం వద్ద జాతీయ రహదారి దాటి ఓబులాపురం, యాపదిన్నె తదితర గ్రామాల మీదుగా పదుల సంఖ్యలో డోన్ మండలంలోని గ్రామాలతోపాటు అటు కృష్ణగిరి మండలం, తుగ్గలి మండలాలకు వెళ్లేందుకు ఈ రహదారి ప్రధానమైనది. ఇక్కడా జాతీయ రహదారిని దాటి వెళాల్సిన పరిస్థితి. ఈ మూడేళ్ల కాలంలో ఇక్కడ 10 మంది వరకు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
వాహనాల వేగ నియంత్రణకు ఏర్పాటు చేసిన డ్రమ్ములు ఇలా..
త్వరలో ఆరు వరుసల రహదారి నిర్మాణం
- శ్రావణ్, ఎన్హెచ్ఏఐ మేనేజర్
జాతీయ రహదారిని త్వరలో ఆరు వరుసలుగా మార్చేందుకు సర్వే చేపడుతున్నాం. ఎక్కడెక్కడ ప్రమాదకరంగా మలుపులున్నాయో అక్కడ అండర్ పాస్లు, సర్వీసు రహదారులు ఏర్పాటు చేయనున్నాం. మరో మూడు నెలల్లో ఆరు వరుసల రహదారి పనులు చేపట్టే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా పార్టీ కార్యాలయం ప్రారంభం
[ 29-03-2024]
కౌతాళం మండలంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి, నాయకులు ప్రారంభించారు. -
దేశ పర్యటనకు బయలుదేరిన అహోబిలం పీఠాధిపతి
[ 29-03-2024]
అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ దేశ పర్యటనకు బయలుదేరారు. -
ఆలూరు నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగరవేస్తాం
[ 29-03-2024]
ఆలూరు నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ను గెలిపించి తెదేపా జెండా ఎగరవేస్తామని ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ ఉపాధ్యక్షులు సాలి సాహెబ్, మండల తెదేపా నాయకులు సతీష్ కుమార్ అన్నారు. -
రానున్న ఎన్నికల్లో తెదేపాదే అధికారం
[ 29-03-2024]
బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెదేపా పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
ఎమ్మిగనూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
పట్టణంలోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. -
ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర గౌడ్
[ 29-03-2024]
ఆలూరు తెదేపా అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ను అదిష్ఠానం ప్రకటించింది. దీనికి సంబంధించి శుక్రవారం జాబితాను విడుదల చేసింది. -
ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకుందాం
[ 29-03-2024]
ఆదోని పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. -
ఆలూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలూరులో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పార్టీ డాక్టర్ సెల్ కార్యదర్శి నెట్టెప్ప ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
[ 29-03-2024]
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
తెదేపాతోనే పేదలకు న్యాయం
[ 29-03-2024]
తెదేపాతోనే పేద, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి నర్సప్ప అన్నారు. -
సీ బెళగల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
మండలకేంద్రమైన సీ బెళగల్లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్