సున్నా వడ్డీకి ఈ-పంట ముడి
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అర్హులను ప్రభుత్వం ఏటేటా కుదిస్తోంది. 2019 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 1.92 లక్షల మందికి రూ.33.53 కోట్ల వడ్డీ రాయితీ వర్తింపజేశారు. 2020 ఖరీఫ్లో 70 వేల మందికి కుదించారు.
రాయితీ వర్తింపులో చిక్కుముళ్లు
వేలాది మందికి మొండిచేయి
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అర్హులను ప్రభుత్వం ఏటేటా కుదిస్తోంది. 2019 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 1.92 లక్షల మందికి రూ.33.53 కోట్ల వడ్డీ రాయితీ వర్తింపజేశారు. 2020 ఖరీఫ్లో 70 వేల మందికి కుదించారు. 2021 ఖరీఫ్లో ఉమ్మడి జిల్లాలో 75 వేల మంది మాత్రమే లబ్ధి పొందడం గమనార్హం. 2020-21 (రబీ), 2021 (ఖరీఫ్), 2019 నుంచి 2020 వరకు వడ్డీ రాయితీ జమకాని 1,82,387 మంది అన్నదాతలకు రూ.38.68 కోట్ల సున్నా వడ్డీ రాయితీని ఈనెల 28న జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ.లక్ష పంట రుణం తీసుకుని సకాలంలో చెల్లించినప్పటికీ రుణం తీసుకున్న పంటకు, ఈ-క్రాప్ నమోదుకు తేడా ఉండటంతో ఉమ్మడి జిల్లాలో 15 వేల మందిని పథకానికి దూరం చేశారు.
అభ్యంతరాల స్వీకరణేదీ..
* వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన అర్హులైన రైతుల జాబితాను రెండు వారాల కిందట రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి విడుదలైంది. నిబంధనల ప్రకారం జాబితాలు ఆర్బీకేల్లో ప్రదర్శించాలి.. అన్నదాతలకు సమాచారం ఇవ్వాలి. ఉమ్మడి జిల్లాలో 877 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. చాలాచోట్ల జాబితాను అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం.
* అర్హులైన రైతుల పేర్లు జాబితాలో లేకపోతే అర్జీలు స్వీకరించాలని కమిషనరేట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. గ్రీవెన్స్ ఆప్షన్ రాలేదని ఉమ్మడి జిల్లాలో అర్జీలు స్వీకరించలేదు. అర్హత ఉన్నా జాబితాలో పేర్లు లేకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు.
కొరవడిన అవగాహన
* సున్నా వడ్డీ లబ్ధి పొందాలంటే ఈ-పంట నమోదై ఉండాలి. ఈ-పంట నమోదు, రుణం తీసుకునే సమయంలో ఒకే పంట నమోదై ఉండాలి. చాలా మంది రైతులకు అవగాహన లేక ఏదో ఓ పంట నమోదు చేయిస్తున్నారు. వేర్వేరుగా ఉండటంతో ఈ-పంటలో ఉన్న వారికే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రాయితీ ఇస్తున్నారు.
* రుణాలు పునరుద్ధరించే సమయంలో ఏ పంట కోసమనేది బ్యాంకర్లు అడగడం లేదు. 1బి, అడంగళ్ ప్రతులు తెప్పించుకుని దరఖాస్తు నమూనా నింపి పక్కన పెడుతున్నారు. తర్వాత ఆన్లైన్ చేసే క్రమంలో ఏదో ఓ పంటను నింపేస్తున్నారు. కొందరు రైతులు వాణిజ్య పంటలకు బ్యాంకులో రుణం తీసుకుని ఈ-పంట నమోదులో ఇతర పంటలను సాగు చేసినట్లు నమోదు చేయించుకుంటున్నారు. ఫలితంగా సమస్యలు ఎదురవుతున్నాయి.
రెండేళ్ల తర్వాత..
2019 నుంచి 2020 వరకు ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.లక్ష పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులు 80,969 మంది వరకు ఉన్నారు. వీరంతా రెండేళ్ల నుంచి సున్నా వడ్డీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం సదించి వీరికి ఇచ్చేందుకు సుముఖత చూపింది. కర్నూలు జిల్లా పరిధిలో 44,416 మంది రైతులకు రూ.9 కోట్లు, నంద్యాల జిల్లాలో 36,553 మందికి రూ.8.12 కోట్లు జమ చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి