ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఒకే ఒక్కడు
నంద్యాల ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కార్యాలయ భవనాన్ని రూ.1.10 కోట్లతో నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇంత మొత్తంలో నిధులు మంజూరు చేయలేని పరిస్థితి ఉండటంతో.. శాఖ పేరిట బ్యాంకుల్లో ఉన్న నగదుపై వచ్చే వడ్డీతో భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
అన్ని పనులూ అస్మదీయుడికే..
నిర్మాణంలో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ భవనం
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : నంద్యాల ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కార్యాలయ భవనాన్ని రూ.1.10 కోట్లతో నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇంత మొత్తంలో నిధులు మంజూరు చేయలేని పరిస్థితి ఉండటంతో.. శాఖ పేరిట బ్యాంకుల్లో ఉన్న నగదుపై వచ్చే వడ్డీతో భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఒకేసారి అంత మొత్తం నిధులకు ప్రతిపాదనలు చేసినా ఉన్నతాధికారులు అంగీకరించరన్న కారణంతో.. పనులను నాలుగు భాగాలుగా విభజించారు. ఒక్కో దానికే టెండర్లు పిలుస్తున్నారు. ఇప్పటికే రూ.30 లక్షల వ్యయంతో పిలిచిన టెండరును అస్మదీయుడైన ఓ గుత్తేదారుకు అప్పగించారు. గోడల వరకు పనులు పూర్తయ్యాయి. తాజాగా పైకప్పు స్థాయి వరకు పనులు చేసేందుకు రూ.20 లక్షలతో రెండోసారి టెండరు పిలిచారు. ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది.
గుట్టుగా టెండర్ల అప్పగింత
ఎస్ఈ గదితో పాటు సమావేశ మందిరం, అకౌంట్స్, డ్రాయింగ్, సిబ్బంది గదులు ఇతర సౌకర్యాలతో భవనం నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. పనుల విభజనలో భాగంగా ఇప్పటికే ఒక టెండరు పూర్తిచేశారు. ఆ మేరకు పనులు కూడా చేశారు. రెండో పనికి ప్రస్తుతం రూ.20 లక్షలతో టెండర్లు పిలిచారు. ఇక మిగిలి పనులకు రూ.60 లక్షలతో అంచనాలు తయారు చేశారు. ఈ మొత్తాన్ని కూడా విడతల వారీగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ప్రతిసారి టెండర్లు పిలిచినా పని మాత్రం ఒకే గుత్తేదారుకు దక్కేలా రూపకల్పన చేశారు. రెండో పనికి కొంతమంది గుత్తేదారులు ఆసక్తి చూపినా కొందరు షెడ్యూళ్లు దాఖలు చేయకుండా నిలువరించడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచే ముందు ప్రకటన జారీ చేస్తారు. సంబంధిత కార్యాలయంలోని నోటీసు బోర్డులో కూడా అంచనా వివరాలు తెలుపుతూ ఆసక్తి గల గుత్తేదారుల నుంచి టెండర్లు కోరుతూ ప్రదర్శిస్తారు. ఎస్ఈ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా టెండరు పిలిచి ఒకరికే అప్పగిస్తున్నారు.
మొత్తం ఆయనకే..
జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అనుచరునిగా చెప్పుకొంటున్న ఓ వ్యక్తి గత కొన్నేళ్లుగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ పరిధిలో పలు సీపీడబ్ల్యూ పథకాలను నిర్వహిస్తున్నారు. సంజామల, కోవెలకుంట్ల, యాగంటిపల్లె, అనుపూరు పథకాలను ఒకరే నిర్వహిస్తున్నారు. అవుకు స్కీంను ఉప గుత్తేదారు హోదాలో చేస్తున్నారు. రూ.4 కోట్ల వ్యయం చేసే ఈ పనులు చేస్తున్న అతనికే ప్రస్తుతం ఎస్ఈ భవన నిర్మాణ టెండర్లు కట్టబెట్టారు. వేరే గుత్తేదారులు ముందుకొచ్చినా ఓ నాయకుడు రంగప్రవేశం చేసి నిలువరిస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా ఈ శాఖ పరిధిలోని పనులన్నీ ఒక్కరికే కట్టబెడుతుండటం వివాదాస్పదంగా మారింది. కొంతమంది అధికారులపై వేటు కూడా పడింది. గతంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న గుత్తేదారుకే వరుసగా పనులు దక్కుతుండటంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమాన సాగునీరు పారిస్తాం
[ 20-04-2024]
‘‘ఆలూరు దద్దరిల్లింది.. ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు.. ఎన్నికలకు సై అంటూ కర్నూలు కాలు దువ్వుతోంది.. వేదవతి ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకొంటా.. నీటి నిల్వను మూడు టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టు లక్ష్యాన్ని వైకాపా నాశనం చేసింది. -
జగన్ సాయమెంత కౌలు రైతు కలవరింత
[ 20-04-2024]
ఈ మహిళ పేరు అయ్యమ్మ. మండల పరిధిలోని హోసూరుకు చెందిన ఈమె భర్త ఉప్పర తిక్కన్న 2022 ఏప్రిల్ 18న అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. -
జగన్ చోద్యం.. ‘కాడి’తప్పిన కౌలుసేద్యం
[ 20-04-2024]
ముఖ్యమంత్రి గారూ...! మీ ఆత్మబంధువు జగన్ పేరిట 2019 జులై 8న రైతులకు మీరు రాసిన లేఖ గుర్తుందా?... రైతు భరోసా ద్వారా కౌలుదార్లకు మేలు జరగబోతోందని చెప్పారు. మరి నిజంగా ఆదిశగా ఏమైనా చేశారా..? -
వైకాపాను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపాను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆదోని పట్టణం స్థానిక అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. -
ఉల్లంఘనులు
[ 20-04-2024]
అధికారం చేతిలో ఉందని నిబంధనలు లెక్కచేయరు.. ఎన్నికల నియమావళిని పాటించరు.. అధికారులు పట్టించుకోరు.. -
‘జగన్ దగా’ఖానాలు
[ 20-04-2024]
కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వాసుపత్రుల ముఖ చిత్రాలు.. వాటి దశ, దిశ మార్చి ఈ చిత్రాలను కూడా రెండేళ్ల తర్వాత మీ ముందుంచుతాం. -
నామపత్రాల సందడి
[ 20-04-2024]
ఆదోని నియోజకవర్గ భాజపా భాజపా అభ్యర్థిగా డాక్టరు పార్థసారథి శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారి శివ్నారయణశర్మకు తన నామపత్రాన్ని అందజేశారు. -
అభ్యర్థులు.. ఆస్తులు
[ 20-04-2024]
కోడుమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సతీశ్ శుక్రవారం నామపత్రాలు దాఖలు చేశారు. కర్నూలులోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో శేషిరెడ్డికి రెండు సెట్ల పత్రాలు అందజేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు: బీవీ
[ 20-04-2024]
రాష్ట్రంలో యువత ఉద్యోగాలు, అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ తెదేపాను గెలిపించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
రూ.కోట్లకు బీటలు.. రోగులతో జగన్ ఆటలు
[ 20-04-2024]
ఆదోని జిల్లా సర్వజన వైద్యశాలలో వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగులు స్థల భావ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ పరిధిలో 10-15 మండలాలకు ఈ ఆస్పత్రి ప్రధాన ఆధారం. -
చంద్రబాబుకు జననీరాజనం
[ 20-04-2024]
వీధులన్నీ పసుపుమయంగా మారాయి. జనసైనికులు తరలివచ్చారు. కాషాయం కార్యకర్తలు కదలివచ్చారు. కూటమి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఓటు వినియోగంతోనే దృఢమైన ప్రజాస్వామ్యం
[ 20-04-2024]
ప్రతిఒక్కరు ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం దృఢంగా ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. -
ట్యాబు జగన్ డాబు
[ 20-04-2024]
‘ట్యాబ్ల కారణంగా పిల్లలకు చదువులకు ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలు బాగా అర్థమవుతాయి. -
రెండోరోజు 6 నామపత్రాలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండోరోజు శుక్రవారం జిల్లాలో ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
[ 20-04-2024]
ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులు(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా ఎస్సై ఎర్రిస్వామి శుక్రవారం తెలిపారు. -
రెండో రోజు 20 మంది
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం నామినేషన్ల పర్వం కొనసాగింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఒకరు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అభ్యర్థులు తమ నామపత్రాలు సమర్పించారు. -
గుట్టుగా ట్యాబ్ల పంపిణీ
[ 20-04-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్సాహం చూపుతున్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం ట్యాబ్ల పంపిణీ విషయం చర్చనీయాంశంగా మారింది.