ఆకాశ వీధిలో.. విజయాల దారిలో..
అనుకున్న సాధించాలన్న కసి.. లక్ష్యం చేరుకోవాలనే తపన ఉంటే.. ఏ రంగంలోనైనా రాణించి విజయం సాధించవచ్చని నిరూపించుకున్నాడు ఆదోని పట్టణానికి చెందిన యువకుడు సాయిరామ్.
వైమానిక కొలువులో సాయిరామ్
న్యూస్టుడే, ఆదోని విద్య: అనుకున్న సాధించాలన్న కసి.. లక్ష్యం చేరుకోవాలనే తపన ఉంటే.. ఏ రంగంలోనైనా రాణించి విజయం సాధించవచ్చని నిరూపించుకున్నాడు ఆదోని పట్టణానికి చెందిన యువకుడు సాయిరామ్. ఎయిర్ఫోర్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎయిర్ క్రాఫ్ట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఆ యువకుడి విజయగాథ ఇది.
* ఆదోని పట్టణం ఎస్బీఐ-2 కాలనీలో నివాసం ఉంటున్న కె.భీమన్న, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. భీమన్న ప్రైవేటు డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన పెద్దకుమారుడు కురవ సాయిరామ్ ఆదోని పట్టణంలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు కరాటే మార్షల్ ఆర్ట్స్ క్రీడలో రాణిస్తూ పలు పతకాలు సొంతం చేసుకున్నాడు.
దేశ రక్షణపై ఆసక్తి..
దేశ రక్షణ దళంలో చేరి సేవలు అందించాలన్న పట్టుదల పాఠశాల వయసులోనే యువకుడు సాయికుమార్కు ఉండేది. ఈ యువకుడి ఆసక్తిని గుర్తించిన పాఠశాల గురువులు, తల్లిదండ్రులు ఇంటర్మీడియేట్ పూర్తవగానే తిరుపతిలోని సాయి డిఫెన్స్ అకాడమిలో చేర్పించారు. 2019లో అకాడమిలో చేరిన ఈ యువకుడు సాధన చేయడం మొదలుపెట్టాడు. అదే సంవత్సరం వైమానిక దళం (ఎయిర్ఫోర్స్)లో ఉద్యోగ ప్రవేశ పరీక్షలకు ఆహ్వానం పలకడంతో ఈ యువకుడు పరీక్షలు రాశాడు. ఉత్తమ ఫలితాలు రావడంతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
రెండేళ్ల పాటు శిక్షణ
వైమానిక దళంలో ఉద్యోగానికి ఎంపికైన యువకుడు సాయిరామ్ కర్ణాటక రాష్ట్రం బెళగావిలో ఎయిర్ఫోర్స్ శాఖలో శిక్షణలో చేరాడు. రెండేళ్ల పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో బి.టెక్ పూర్తి చేసుకున్నాడు. శిక్షణ పూర్తికావడంతో ఎయిర్స్ఫోర్స్లో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం గోరక్పూర్లో ఎయిర్ క్రాఫ్ట్ ఉద్యోగం చేరాడు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతోనే ఈ ఉద్యోగం సాధించానని యువకుడు సాయిరామ్ పేర్కొంటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రహదారుల బాగుకు చర్యలు : బుగ్గన
[ 18-04-2024]
వైకాపా వెన్నుపోటుదారులకు, అవాకులు చవాకులు మాట్లాడే వారికి ఎన్నికల తర్వాత కోలుకోలేని విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. -
కర్నూలు నియోజకవర్గం చుట్టూ మూడు చెక్పోస్టులు
[ 18-04-2024]
కర్నూలు నియోజకవర్గం చుట్టూ 24 గంటలు నిఘా ఉంచేందుకు మూడు స్టాటస్టికల్ సరైలైన్స్ టీమ్లతో కూడిన చెక్పోస్టులను ఏర్పాటుచేస్తూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కర్నూలు నగరపాలకసంస్థ కమిషనర్ భార్గవ్తేజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానుంది. -
వైకాపా అంతర్గత వైరం.. బహిరంగం
[ 18-04-2024]
వైకాపా అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బలనిరూపణ, సామాజికవర్గంలో పెత్తనం, గ్రామాలు, మండలాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ విభేదాలు బహిర్గతమవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!