ప్రతిపాదనలతో సరి
కొత్త స్టేషన్ల ఏర్పాటు ఊసే లేకపోవడం.. సిబ్బంది నియామకాలు కానరాకపోవడంతో మద్య నిషేధ అబ్కారీ శాఖ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలపై పనిభారం పెరిగిపోయింది.
అందుబాటులోకి రాని కొత్త సెబ్ స్టేషన్లు
కర్నూలులోని సెబ్ స్టేషన్
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే : కొత్త స్టేషన్ల ఏర్పాటు ఊసే లేకపోవడం.. సిబ్బంది నియామకాలు కానరాకపోవడంతో మద్య నిషేధ అబ్కారీ శాఖ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలపై పనిభారం పెరిగిపోయింది. ఫలితంగా నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 సెబ్ స్టేషన్లు ఉన్నాయి. స్టేషన్లవారీగా పరిశీలిస్తే.. కర్నూలు-3, కోడుమూరు-5, నందికొట్కూరు-4, ఆదోని-2, ఆలూరు-5, ఎమ్మిగనూరు-3, కోసిగి-2, పత్తికొండ-5, నంద్యాల-5, ఆళ్లగడ్డ-5, కోవెలకుంట్ల-4, బనగానపల్ల్లి-3, డోన్-3, ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో డోన్ స్టేషన్ పరిధిలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాలు కోడుమూరు స్టేషన్ పరిధిలోకి వచ్చాయి. నేరాల నియంత్రణ కోసం గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో మూడు కొత్త స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. నంద్యాల జిల్లాలో రెండు, కర్నూలు జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీశైలం.. ఆత్మకూరు స్టేషన్ పరిధిలో ఉండటంతో నిఘా కొరవడటం పెద్ద సమస్యగా మారింది. కొన్ని స్టేషన్ల పరిధిలో తక్కువ మండలాలు.. మరికొన్నింటి పరిధిలో ఎక్కువ మండలాలు ఉండటంతో నేరాల నియంత్రణ కష్టసాధ్యంగా మారింది. పత్తికొండలో ఐదు మండలాలు ఉండగా ఆదోని, కోసిగి పరిధిలో రెండు మండలాలు మాత్రమే ఉన్నాయి. ఈ మేరకు పునర్విభజన చేయాలని ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త స్టేషన్ల ప్రతిపాదన, పునర్విభజన ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు.
తనిఖీలు అంతంతమాత్రమే
మద్య నిషేధ.. అబ్కారీ శాఖ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోగా విభజన చెందిన తర్వాత రెండింటిలో సిబ్బంది కొరత మరింత తీవ్రమైంది. సెబ్ స్టేషన్లలో కనీసం 10 మంది సిబ్బంది కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అధికారుల స్థాయిలో లోటు లేనప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్ల సంఖ్య మరీ తక్కువగా ఉంది. 250 మందికిగాను కేవలం 148 మంది మాత్రమే ఉన్నారు. 102 కానిస్టేబుళ్ల కొరత ఉండటం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో సెబ్ సమర్థంగా పనిచేయలేకపోతోందన్న అభిప్రాయం ఉంది. ఇటీవలకాలంలో జిల్లాలో తెలంగాణ, కర్ణాటక మద్యం అక్రమ రవాణా అదుపు చేయలేని స్థాయికి చేరింది. సిబ్బంది లోటుతో కర్నూలు మండలం పంచలింగాల పరిధిలోని అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో వాహనాలు తనిఖీ చేస్తున్న దాఖలాలు లేవు. మిగిలిన చెక్పోస్టుల పరిస్థితి ఇలానే ఉంది. మరోవైపు సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మద్య నిషేధ, అబ్కారీ శాఖలోనూ సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లను పూర్తిస్థాయిలో పర్యవేక్షించలేకపోతున్నారు.
కేసుల నమోదు ఇలా..
కర్నూలు జిల్లా పరిధిలో సారాకు సంబంధించి ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబరు వరకు 838 మందిని అరెస్టు చేసి 8,635 లీటర్ల సారా.. 21,660 కేజీల బెల్లం, 99 వాహనాలు సీజ్ చేశారు. అక్రమ మద్యానికి సంబంధించి 1,023 కేసులు నమోదు చేసి 1,211 మందిని అరెస్టు చేసి 21,526 లీటర్ల మద్యం, 110 వాహనాలు సీజ్ చేశారు. పోలీసుస్టేషన్లలోనూ కేసులు నమోదు చేస్తుండటంతో సెబ్పై కొంతభారం తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనారిటీల అభివృద్ధిని విస్మరించిన వైకాపా
[ 24-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు. -
తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు
[ 24-04-2024]
రాష్ట్రంలో తెదేపాను గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి