ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలి
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తక్షణమే ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బంగి శ్రీధర్ డిమాండ్ చేశారు.
మాట్లాడుతున్న ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, పక్కన నంద్యాల జిల్లా అధ్యక్షులు నరసింహులు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తక్షణమే ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బంగి శ్రీధర్ డిమాండ్ చేశారు. కర్నూలు బి.క్యాంపులోని ఏపీజీఈఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు నరసింహులుతో కలిసి మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి ప్రతి నెలా ఈహెచ్ఎస్ కింద డబ్బులు ప్రభుత్వానికి జమవుతున్నప్పటికీ ఇంతవరకు ఆరోగ్య కార్డుల ఊసే లేదన్నారు. ఆరోగ్య కార్డులు జారీ చేయాలని, మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీజీఈఏ పక్షాన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీజీఈఏ నగర అధ్యక్ష, కార్యదర్శులు జి.కృష్ణమూర్తి, డి. చెన్నకృష్ణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు వీరేష్, కర్నూలు జిల్లా కార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి డి.శ్రీనివాసమూర్తి, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని