ముఖ హాజరు.. ముప్పుతిప్పలు
కళాశాలల్లో బోగస్ హాజరుకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ హాజరు మొదటి రోజు ఇబ్బందులకు గురి చేసింది. ఉమ్మడి జిల్లాలోని పలు కళాశాలల్లో సాంకేతిక కారణాల వల్ల హాజరు సక్రమంగా చూపలేదు.
ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ముఖ హాజరు నమోదు చేస్తున్న అధ్యాపకురాలు
ఆత్మకూరు, న్యూస్టుడే: కళాశాలల్లో బోగస్ హాజరుకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ హాజరు మొదటి రోజు ఇబ్బందులకు గురి చేసింది. ఉమ్మడి జిల్లాలోని పలు కళాశాలల్లో సాంకేతిక కారణాల వల్ల హాజరు సక్రమంగా చూపలేదు. విద్యా దీవెన, వసతి దీవెన లబ్ధి పొందుతున్న విద్యార్థుల పేర్లు మాత్రమే యాప్లో కనిపిస్తుండటంతో మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో బస్సుల్లేక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఆలస్యంగా వస్తారు. వీరంతా గైర్హాజరుగా నమోదవుతుంది... హాజరు శాతం తక్కువైతే ప్రభుత్వ విద్యా పథకాలకు దూరమవుతారు.
మొదటి దశలో డిగ్రీ కళాశాలల్లో
కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫేస్ అటెండెన్స్ (ముఖ హాజరు) విధానాన్ని అమలు చేయాలని ప్రభుతం నిర్ణయించింది. మొదటి దశలో డిగ్రీ కళాశాలల్లో ఈ ప్రక్రియను గురువారం నుంచి ప్రారంభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 26 ప్రభుత్వ, 9 ఎయిడెడ్, 103 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అధ్యాపకులతో పాటు విద్యార్థుల హాజరు నమోదుకు ప్రత్యేక యాప్ను రూపొందించారు. ఆయా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు యూజర్ నేమ్, పాస్వర్డ్లను పంపించారు. విద్యార్థుల ముఖాలను పలు కోణాల్లో ఫొటోలు తీసి యాప్లో పొందుపర్చారు. యాప్ను ఉపయోగించి తరగతి గది వద్ద విద్యార్థుల ముఖాలను ఫొటో తీస్తే హాజరు నమోదు అవుతుంది.
మొదటిరోజే అవాంతరాలు
* కర్నూలు కేవీఆర్ కళాశాలలో 1122 మంది విద్యార్థులకు 90 శాతం మంది గురువారం హాజరైనట్లు ప్రిన్సిపల్ తెలిపారు. 83 మంది మాత్రమే హాజరైనట్లు యాప్లో చూపుతోంది. 1039 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు నమోదైంది. ట్రయల్ రన్లో సాంకేతిక కారణాలతో హాజరు తక్కువగా నమోదైనట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు.
* ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు 146 మంది ఉన్నారు. మొదటి రోజు 67 మంది ముఖ హాజరు నమోదైంది. 79 మంది గైర్హాజరయ్యారు.
* నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1743 మంది విద్యార్థులకు గాను 526 మంది హాజరయ్యారు. 34 శాతం హాజరు నమోదైంది.
పథకాలకు దూరమవుతాం
- కె.విజయ్కుమార్రాజు, బీఏ ద్వితీయ సంవత్సరం
మాది ఇందిరేశ్వరం. ఉదయం పొలం పనులకు వెళ్లొచ్చాక కళాశాలకు వస్తుంటాను. ఊరి నుంచి బస్సులో ఆత్మకూరు బస్టాండుకు వచ్చి అక్కడి నుంచి దాదాపు ఒకటిన్నర కి.మీ నడిచి కళాశాలకు వెళ్లాలి. బస్సు ఆలస్యమైన రోజుల్లో హాజరు నష్టపోవాల్సి వస్తోంది. మాలాంటి పేద విద్యార్థులు తక్కువ హాజరు కారణంగా విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి పథకాలు కోల్పోవాల్సి వస్తుంది.
వెసులుబాటు కల్పించాలి
- మన్నెం, అశోక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆత్మకూరు
నాకు చిన్నప్పటి నుంచి మూర్ఛ వస్తుంటుంది. ఆరోగ్యం సరిగా ఉండదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులకు వెళుతుంటాను. ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఇంటి వద్దనే ఉంటాను. ముఖ హాజరు వల్ల రోజూ కళాశాలకు హాజరవ్వాల్సి ఉంటుంది. హాజరు శాతం తగ్గితే విద్యాదీవెన వంటి పథకాలు అందవు. అనారోగ్యంతో బాధపడే నాలాంటి వారికి వెసులుబాటు కల్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
[ 19-04-2024]
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
జగన్ ఆటలు ఇక సాగవు..
[ 19-04-2024]
తెదేపా ఇంటింటి ప్రచారంలో భాగంగా కౌతాళం మండలం నందు బంటకుంటా గ్రామంలో ప్రతి ఇంటింటికీ వెళ్ళి జగన్ చేస్తున్న, అరాచకాలు, దోపిడి, దౌర్జన్యాలు, వివరిస్తూ, 2019లో కోడికత్తి, ఈసారి గులక రాయి అంటున్నాడని తెదేపా నేతలు పేర్కొన్నారు. -
ఇంటిఇంటికి తెలుగుదేశం
[ 19-04-2024]
ఇంటిఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, ఆయన సోదరులు రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న పాల్గొన్నారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
[ 19-04-2024]
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి