logo

విద్యార్థులే కూలీలు..ప్రమాదకరంగా పనులు

వెలుగోడులోని ఇందిరానగర్‌ ప్రాథమిక పాఠశాలలో నాడు- నేడు కింద వంటగది, శౌచాలయం పనులు జరుగుతున్నాయి. 

Published : 02 Dec 2022 02:54 IST

వెలుగోడులోని ఇందిరానగర్‌ ప్రాథమిక పాఠశాలలో నాడు- నేడు కింద వంటగది, శౌచాలయం పనులు జరుగుతున్నాయి. నిర్మాణాలకు క్యూరింగ్‌ పనులను విద్యార్థులతో చేయిస్తున్నారు. పిల్లలు గోడలపైకి ఎక్కి ప్రమాదకరంగా నీళ్లు పడుతున్నారు. కిందనే రాళ్ల కుప్పలు ఉన్నాయి. పొరపాటున జారి పడితే ప్రాణాలకే ప్రమాదం. పిల్లలతో పనులు చేయించకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, వెలుగోడు (నంద్యాల బొమ్మలసత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని