ఆరు నెలల్లో ఎన్నికలు రావొచ్చు
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి విమర్శించారు.
మాట్లాడుతున్న తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి
కోడుమూరు గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి విమర్శించారు. ఈ ప్రభుత్వం పని అయిపోయిందని, ఆరునెలల్లో శాసనసభ ఎన్నికలు రావచ్చునని పేర్కొన్నారు. కోడుమూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. మద్యం, ఇసుకతో డబ్బులు దోచుకుని దాచుకుంటున్నారన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తున్న తెదేపా నాయకులపైన అనవసరంగా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ సొమ్ముతో ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు జల్లేందుకు వైకాపా నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సర్పంచి భాగ్యరత్న, కేఈ మల్లికార్జునగౌడ్, సి.బి.లత, ఎల్లప్పనాయుడు, ఇంతియాజ్, లక్ష్మయ్య, రవీంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!