logo

తెదేపా అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు

ఆదోని మండలం దిబ్బనకల్లు గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి ’ కార్యక్రమం నిర్వహించారు.

Updated : 02 Dec 2022 15:21 IST

ఆదోని మార్కెట్‌ : ఆదోని మండలం దిబ్బనకల్లు గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు  చేసిన సభలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధికి నోచుకోకుండా జగన్‌ వైరస్‌ అడ్డుపడుతోందని, దాన్ని ప్రజలంతా కలిసి సమూలంగా నిర్మూలించాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అభివృద్ధి వైపు అడుగులు వేస్తే.. జగన్‌ కూలగొట్టడంతోనే పాలన ప్రారంభించారన్నారు. ప్రజలు తెదేపా అధికారంలోని రావాలని బలంగా కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు బుద్ధారెడ్డి, అఫ్సర్‌ బాషా, తిమ్మప్ప, రామాంజి, బాలాజీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని