logo

రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

కర్నూలు జిల్లా సీనియర్‌ ఫుట్‌బాల్‌ జట్టు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. శుక్రవారం స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఎంపికైన జట్టు పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

Updated : 02 Dec 2022 15:22 IST

ఆదోని మార్కెట్‌ : కర్నూలు జిల్లా సీనియర్‌ ఫుట్‌బాల్‌ జట్టు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. శుక్రవారం స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఎంపికైన జట్టు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. గత నాలుగు రోజులుగా జరిగిన శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబరిచి పోటీలకు ఎంపికైనట్లు కర్నూలు జిల్లా ఫుట్‌బాల్‌ కార్యదర్శి లక్ష్మీకాంత్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు వైజాగ్‌లో పోటీలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా స్థానిక వంశీ చైతన్య నర్సింగ్‌ హోం నిర్వాహకులు రమేష్‌యాదవ్‌ క్రీడాకారులకు ఉచితంగా జర్సీలు, బూట్లు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని