మోగిన పెళ్లి బాజా
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెళ్లి సందడి మొదలైంది. శుక్రవారం నుంచి మంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. కల్యాణ మండపాలన్నీ కళకళలాడుతున్నాయి.
మహానంది, న్యూస్టుడే : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెళ్లి సందడి మొదలైంది. శుక్రవారం నుంచి మంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. కల్యాణ మండపాలన్నీ కళకళలాడుతున్నాయి. ఊరూరా బాజాభజంత్రీలు మోగుతున్నాయి. ఈనెలలో ఉమ్మడి జిల్లాలో వేల జంటలు ఒక్కటి కాబోతున్నాయి.సాధారణంగా కార్తిక మాసంలో వివాహాలు ఎక్కువ జరుగుతాయి. ఈసారి మూఢాలు (మౌఢ్యమి) రావడంతో నిలిచిపోయాయి. డిసెంబరులో మార్గశిర మాసం ప్రారంభం కావడంతో కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వివాహాలు జోరందుకున్నాయి. డిసెంబరు 2, 3, 4, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18వ తేదీలు కల్యాణాలకు మంచి ముహూర్తాలని పండితులు చెబుతున్నారు. వీటిలో 4, 8, 14, 17, 18వ తేదీల్లో దివ్యమైన లగ్గాలు ఉన్నట్లు వివరిస్తున్నారు.
జోరందుకున్న వ్యాపారాలు
* శ్రావణ మాసంలో వివాహాలు జరిగాయి. భాద్రపద, ఆశ్వీయుజ, కార్తిక మాసాల్లో మూఢాలు రావడంతో ముహూర్తాలు లేవు. తిరిగి మార్గశిర మాసంలో పెళ్లిళ్లకు అనుకూలమైన ఘడియలు వచ్చాయి. పెళ్లి సందడి మొదలవడంతో వివిధ వ్యాపారాలు జోరందుకున్నాయి.
* వస్త్ర, బంగారు వ్యాపారాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. కల్యాణ మండపాలు మూడు నెలల ముందుగానే బుక్ అయ్యాయి. ఒక్కో మందిరంలో రోజుకు రెండు నుంచి మూడు పెళ్లిళ్లు జరుగనున్నాయి.
* ఈనెల 18న దివ్యమైన ముహూర్తం ఉండటంతో ఆ ఒక్కరోజే వేలాది పెళ్లిళ్లు జరుగనున్నాయి. దీంతో కల్యాణ మండపాలు లభించక చాలామంది ఆలయాల్లో వేడుకలు జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
* అలంకరణ నిపుణులు, ట్రావెల్స్, బాజాభజంత్రీలు, వంట వారు, ఆర్కెస్ట్రా, శుభలేఖల ముద్రణ సంస్థలు, పూల వ్యాపారులు, పాన్ దుకాణదారులు, సప్లయర్స్, టెంట్హౌస్లు, క్యాటరింగ్, ఫొటో, వీడియోగ్రాఫర్లకు గిరాకీ పెరిగింది.
చేతినిండా పని: లక్ష్మణ్, మహానంది
నేను సప్లయర్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాను. రెండేళ్లుగా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. ఆర్థికంగా నష్టపోయాం. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వివాహ ముహూర్తాలు అధికంగా ఉండటంతో ఆర్డర్లు ఎక్కువగానే వచ్చాయి. చేతినిండా పని దొరికింది. ఒక్కోరోజు రెండుమూడు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి సామగ్రిని తీసుకొస్తున్నాం.
మార్చి 19 వరకు
- రవిశంకర అవధాని, వేదపండితుడు, మహానంది
ఈనెల 2 నుంచి 18వ తేదీ వరకు, 2023 జనవరి 25 నుంచి మార్చి 19 వరకు వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయి. మూడు నెలల అనంతరం మంచి ముహూర్తాలు రావడంతో వేల సంఖ్యలో వివాహాలు జరుగనున్నాయి. వివాహాలతో పాటు నిశ్ఛయ తాంబూలాలు, గృహ ప్రవేశాలు చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రానున్న ఎన్నికల్లో తెదేపాదే అధికారం
[ 29-03-2024]
బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెదేపా పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
ఎమ్మిగనూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
పట్టణంలోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. -
ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర గౌడ్
[ 29-03-2024]
ఆలూరు తెదేపా అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ను అదిష్ఠానం ప్రకటించింది. దీనికి సంబంధించి శుక్రవారం జాబితాను విడుదల చేసింది. -
ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకుందాం
[ 29-03-2024]
ఆదోని పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. -
ఆలూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలూరులో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పార్టీ డాక్టర్ సెల్ కార్యదర్శి నెట్టెప్ప ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
[ 29-03-2024]
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
తెదేపాతోనే పేదలకు న్యాయం
[ 29-03-2024]
తెదేపాతోనే పేద, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి నర్సప్ప అన్నారు. -
సీ బెళగల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
మండలకేంద్రమైన సీ బెళగల్లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!