logo

ప్రాజెక్టులు పూర్తి చేసి సింహ గర్జన పెట్టుకోండి

రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసిన తరువాతే రాయలసీమ గర్జన పెట్టుకోండని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సూచించారు.

Published : 04 Dec 2022 01:13 IST

ఆలూరు, న్యూస్‌టుడే: రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసిన తరువాతే రాయలసీమ గర్జన పెట్టుకోండని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సూచించారు. ఆలూరులోని తెదేపా కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన చూసి ఓర్వలేక వైకాపా నాయకులు ఇప్పుడు రాయలసీమ గర్జనకు తెరలేపారన్నారు. రాయలసీమకు ఏమి చేశారని గర్జన పెడుతున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన గర్జన పనికి రానిదని విమర్శించారు. తెదేపా రాయలసీమకు వ్యతిరేకం కాదని.. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని, ఒక్క ఛాన్స్‌ అని చెప్పి ప్రజల్లో అభిమానం పోగొట్టుకున్నారన్నారు. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో ఉపాధి లేక అనేక మంది వలసలు వెళ్తుంటే ఉపాధి కల్పించి వలసలు నివారించకపోవడం దారుణమన్నారు. తాగేందుకు నీరు లేకపోయినా సారా మాత్రం విచ్చలవిడిగా లభిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, మండల కన్వీనర్‌ అశోక్‌, కొమ్ము రామాంజనేయులు, నాగరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని