భగ్గుమన్న విభేదాల నిప్పు
నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కోళ్లబావాపురం గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
యువకుడిపై హత్యాయత్నం
కోళ్లబావాపురంలో పికెటింగ్
పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఇంటిని పరిశీలిస్తున్న ఎస్సై
నందికొట్కూరు, నందికొట్కూరు గ్రామీణం, న్యూస్టుడే: నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కోళ్లబావాపురం గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గాల వారు పరస్పర దాడులతో ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల గ్రామానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను మరోవర్గం వారు నిలదీశారు. వివాదం ముదిరి రెండువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఠాణాలో కేసులు పెట్టుకున్నారు. ఇది సద్దుమణగక ముందే తాజాగా గ్రామంలో ఓ యువకుడిపై హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాస్కర్ కుమారుడు నాగరాజు అధికార పార్టీకి చెందిన సభ్యుడైనా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వ్యవసాయం చేసుకుంటూ గడుపుతున్నారు. ఆయన భార్య తన పిల్లలతో పుట్టినిల్లు అలంపూరుకు వెళ్లారు. సోమవారం రాత్రి నాగరాజు ఇంట్లో నిద్రిస్తుండగా తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు బయట గడియపెట్టి కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పుపెట్టి పరారయ్యారు. మంటలు చెలరేగి ఇళ్లంతా పొగ కమ్ముకుంది. పొగ వాసనకు మేల్కొన్న ఆయన భయంతో కేకలు పెట్టాడు. చుట్ట్టుపక్కలవారు వచ్చి తలుపు తీయడంతో బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి ఘటన తీరును పరిశీలించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గ్రామంలో ఎస్సై ఓబులేసు ఆధ్వర్యంలో పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM