ఇసుక, మద్యంపైనే వైకాపా నేతల దృష్టి : కోట్ల
అధికార వైకాపా ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, ఇసుక, మద్యంపైనే నాయకులు దృష్టి పెట్టారని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి అన్నారు.
బూడిదపాడులో పర్యటిస్తున్న కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి
గూడూరు, న్యూస్టుడే: అధికార వైకాపా ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, ఇసుక, మద్యంపైనే నాయకులు దృష్టి పెట్టారని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి అన్నారు. గూడూరు మండలం బూడిదపాడు గ్రామంలో మంగళవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో మాస్కులు కుట్టిన వాళ్లకు సైతం వైకాపా నాయకులు డబ్బు చెల్లించలేదన్నారు. జేబులు నింపుకోవడానికే వారికాలం సరిపోతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెదేపాకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. తెదేపా అధికారంలోకి రాగానే రైతులకు సంవృద్ధిగా ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా కోడుమూరు బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్, మండల బాధ్యుడు సుధాకరరెడ్డి, బంగారు శ్రీను, సుందరరాజు, మద్దిలేటి, రాముడు, ఈరన్న, సురేశ్, బుగ్గన్న, కాడప్ప, నరసింహులు, రాజు తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్ర విజయవంతం చేస్తాం
నారా లోకేశ్తో తెలుగుయువత నాయకులు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: మోసపూరిత హామీలతో ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైకాపా అన్ని వర్గాలనూ నయవంచనకు గురి చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళవారం కర్నూలు పార్లమెంటరీ తెలుగు యువత కార్యదర్శి ఎస్.మోతిలాల్, పాణ్యం తెలుగుయువత అధికార ప్రతినిధి కోట్ల తిమ్మారెడ్డి, నందమూరి యువసేవా సమితి అధ్యక్షుడు డి.రమేశ్కుమార్రెడ్డి తదితరులు హైదరాబాద్లో లోకేశ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం చేపట్టబోయే ఏ కార్యక్రమానికైనా వెన్నంటి నడుస్తామని, పాదయాత్రను విజయవంతం చేస్తామని వారు ఆయనకు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఫారూక్, అస్లామ్, మనోహర్బాబు, శంకర్, ఓబులేసు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు గాలికొదిలేశారు
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో గౌరు చరితారెడ్డి, తదితరులు
కల్లూరు గ్రామీణ : వైకాపా ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి తెలిపారు. కల్లూరు పట్టణం 34వ వార్డులో మంగళవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీల్లో పర్యటించి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణ చేశారు.
బీసీలను మోసం చేస్తున్న జగన్
ఆదోని గ్రామీణం : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని ఆదోని నియోజకవర్గ తెదేపా బాధ్యుడు మీనాక్షినాయుడు అన్నారు. ఆదోని పట్టణంలోని శుక్రవారం పేట 41 వార్డు, కార్వన్పేట 14 వార్డులో మంగళవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. తెదేపా బాధ్యుడు మీనాక్షినాయుడు పాల్గొని ఇంటింటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాయలసీమ గర్జన పేరిట సభలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలంతా ఏకమై జగన్ను ఇంటికి పంపే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. తెదేపా నాయకులు గిడ్డి శంకర్, బాలాజీ, లక్ష్మన్న, మల్లికార్జున, హనుమంతు, శివ, మహానంది, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు పర్యటన భయంతోనే రాయలసీమ గర్జన
మాట్లాడుతున్న పి.తిక్కారెడ్డి
మంత్రాలయం : జిల్లాలో చంద్రబాబునాయుడు పర్యటన విజయవంతం కావడంతో భయపడి వైకాపా నాయకులు సీమ గర్జన పెట్టారని మంత్రాలయం నియోజకవర్గ తెదేపా బాధ్యుడు పి.తిక్కారెడ్డి విమర్శించారు. మంత్రాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో చంద్రబాబునాయుడు పర్యటనకు అర్ధరాత్రి అయినా ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారన్నారు. లక్ష మందితో గర్జన అని పెడితే 14 వేల మంది లేరని ఎద్దేవా చేశారు. చావడి వెంకటేశులు, కృష్ణమోహన్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, చంద్ర, లక్ష్మయ్య, సత్యనారాయణరెడ్డి, చైర్మన్ నరసింహ, ఏబు, విజయ్, భీమన్న, సుంకప్ప పాల్గొన్నారు.
సంక్షేమం పేరుతో నిలువు దోపిడీ
ముగతిలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే బీవీ
నందవరం(ముగతి), న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో నిలువు దోపిడీ చేస్తోందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ.జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు. మండలం లోని ముగతి గ్రామంలో బుధవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి తెదేపా జెండా ఆవిష్కరించి, ఎన్టి.రామారావు, మాజీ మంత్రి బీవీ.మోహన్రెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ఈరన్నగౌడ్, భార్గవ్ యాదవ్, దేశాయి మాధవరావు, చిన్నరాముడు, ఖాశీంవలి, నారాయణరెడ్డి, గోపాల్, బాలరాజు, రఘుమూర్తి స్వామి, తాయన్న, బండేగురు స్వామి, కొండ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధిలో శూన్యం
తెర్నేకల్ (దేవనకొండ) న్యూస్టుడే: వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆలూరు తెదేపా బాధ్యురాలు కోట్ల సుజాతమ్మ పేర్కొన్నారు. దేవనకొండ మండలంలోని కరివేముల, తెర్నేకల్ గ్రామాల్లో మంగళవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జలాశయాల్లో నీరున్నా పాలకుల నిర్లక్ష్యంతో పంటలకు డిసెంబర్ వరకే ఇస్తామని చెప్పడం ఇదేం ఖర్మ మనకు అని విమర్శించారు. గర్జనల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ విజయ్, మల్లయ్య, ఉచ్చీరప్ప, వెంకటరెడ్డి, నాగేష్, రాముడు, తిమ్మప్ప, లతీఫ్, మాలీక్, గిడ్డయ్య, మండల నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి