logo

సంఘటితంగా పోరాటం

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు సంఘటితంగా పోరాడదామని ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Published : 09 Dec 2022 03:44 IST

బొప్పరాజు వెంకటేశ్వర్లును సన్మానిస్తున్న ప్రభుత్వ వాహన
డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు సంఘటితంగా పోరాడదామని ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ పొదుపు భవన్‌లో ఏపీ రెవెన్యూ ఉద్యోగుల జిల్లా కార్యవర్గ సమావేశం, ఏపీ ఐకాస అమరావతి జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర కోశాధికారి గిరికుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. అందరూ కలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆంజనేయకుమార్‌, ఏపీ ఐకాస అమరావతి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నాగమణి, జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏపీఆర్‌ఎస్‌ఏ నంద్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కామేశ్వరరెడ్డి, రామచంద్రరావు, సత్యదీప్‌, కర్నూలు, ఆదోని, పత్తికొండ డివిజన్ల నాయకులు శ్రీనివాసులు, వెంకటరాజు, వేణుగోపాల్‌రావు, రజనీకాంత్‌రెడ్డి, వలీబాషా, వీఆర్వోల సంఘం నాయకులు రాముడు, మద్దిలేటి, స్వామన్న, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని