logo

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం: బీసీ

బనగానపల్లి నియోజకవర్గంలో ఈ నెల 12 నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నినాదంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

Published : 09 Dec 2022 03:44 IST

గోడ ప్రతులు విడుదల చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లి నియోజకవర్గంలో ఈ నెల 12 నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నినాదంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం తెదేపా కార్యాలయంలో ఆయన కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను విడుదల చేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. పాదయాత్ర సమయంలో ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడి రూ.కోట్ల దోచుకుంటున్నారని తెలిపారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, కప్పెట నాగేశ్వరరెడ్డి, తులసిరెడ్డి, నాగేంద్రరెడ్డి, బాలరాజు, బొబ్బల మద్దిలేటిరెడ్డి, కైప రఘునాథరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని