ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం: బీసీ
బనగానపల్లి నియోజకవర్గంలో ఈ నెల 12 నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నినాదంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి తెలిపారు.
గోడ ప్రతులు విడుదల చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి
బనగానపల్లి, న్యూస్టుడే: బనగానపల్లి నియోజకవర్గంలో ఈ నెల 12 నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నినాదంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి తెలిపారు. గురువారం తెదేపా కార్యాలయంలో ఆయన కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను విడుదల చేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. పాదయాత్ర సమయంలో ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడి రూ.కోట్ల దోచుకుంటున్నారని తెలిపారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, కప్పెట నాగేశ్వరరెడ్డి, తులసిరెడ్డి, నాగేంద్రరెడ్డి, బాలరాజు, బొబ్బల మద్దిలేటిరెడ్డి, కైప రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపాను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆదోని పట్టణం స్థానిక అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. -
ఉల్లంఘనులు
[ 20-04-2024]
అధికారం చేతిలో ఉందని నిబంధనలు లెక్కచేయరు.. ఎన్నికల నియమావళిని పాటించరు.. అధికారులు పట్టించుకోరు.. -
‘జగన్ దగా’ఖానాలు
[ 20-04-2024]
కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వాసుపత్రుల ముఖ చిత్రాలు.. వాటి దశ, దిశ మార్చి ఈ చిత్రాలను కూడా రెండేళ్ల తర్వాత మీ ముందుంచుతాం. -
నామపత్రాల సందడి
[ 20-04-2024]
ఆదోని నియోజకవర్గ భాజపా భాజపా అభ్యర్థిగా డాక్టరు పార్థసారథి శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారి శివ్నారయణశర్మకు తన నామపత్రాన్ని అందజేశారు. -
అభ్యర్థులు.. ఆస్తులు
[ 20-04-2024]
కోడుమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సతీశ్ శుక్రవారం నామపత్రాలు దాఖలు చేశారు. కర్నూలులోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో శేషిరెడ్డికి రెండు సెట్ల పత్రాలు అందజేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు: బీవీ
[ 20-04-2024]
రాష్ట్రంలో యువత ఉద్యోగాలు, అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ తెదేపాను గెలిపించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
రూ.కోట్లకు బీటలు.. రోగులతో జగన్ ఆటలు
[ 20-04-2024]
ఆదోని జిల్లా సర్వజన వైద్యశాలలో వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగులు స్థల భావ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ పరిధిలో 10-15 మండలాలకు ఈ ఆస్పత్రి ప్రధాన ఆధారం. -
చంద్రబాబుకు జననీరాజనం
[ 20-04-2024]
వీధులన్నీ పసుపుమయంగా మారాయి. జనసైనికులు తరలివచ్చారు. కాషాయం కార్యకర్తలు కదలివచ్చారు. కూటమి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఓటు వినియోగంతోనే దృఢమైన ప్రజాస్వామ్యం
[ 20-04-2024]
ప్రతిఒక్కరు ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం దృఢంగా ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. -
ట్యాబు జగన్ డాబు
[ 20-04-2024]
‘ట్యాబ్ల కారణంగా పిల్లలకు చదువులకు ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలు బాగా అర్థమవుతాయి. -
రెండోరోజు 6 నామపత్రాలు
[ 20-04-2024]
-
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
[ 20-04-2024]
ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులు(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా ఎస్సై ఎర్రిస్వామి శుక్రవారం తెలిపారు. -
రెండో రోజు 20 మంది
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం నామినేషన్ల పర్వం కొనసాగింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఒకరు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అభ్యర్థులు తమ నామపత్రాలు సమర్పించారు. -
గుట్టుగా ట్యాబ్ల పంపిణీ
[ 20-04-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్సాహం చూపుతున్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం ట్యాబ్ల పంపిణీ విషయం చర్చనీయాంశంగా మారింది.