జనసేనకు బలం వీర మహిళలే
వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని.. కరవు ప్రాంతంగా మార్చేసిందని.
అధికారంలోకి వస్తే పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తాం
జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు
మాట్లాడుతున్న నాగబాబు
కల్లూరు గ్రామీణ, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని.. కరవు ప్రాంతంగా మార్చేసిందని.. ప్రస్తుతం అడుక్కునే స్థితికి పాలకులు తెచ్చారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు అన్నారు. కర్నూలు నగరంలోని మౌర్యఇన్ హోటల్లో జిల్లా వీర మహిళలు, జన సైనికులకు దిశానిర్దేశం చేసేందుకు శనివారం సభ ఏర్పాటు చేశారు. ఉదయం వీర మహిళల సమస్యలు, అభిప్రాయాలు సేకరించారు. మధ్యాహ్నం జన సైనికులతో చర్చించారు. వైకాపా ప్రభుత్వం ఏవిధంగా వేధిస్తోందో పలువురు చెప్పారు. తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. అనంతరం నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీకి బలం వీర మహిళలేనన్నారు. వారికి పార్టీ తోడుగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు జనసేనాని మంచి ఆలోచనతో ఉందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు చేయాలన్న ఆలోచన రాకుండా చూస్తామన్నారు. సుగాలి ప్రీతి కేసును ఇంతవరకు పరిష్కరించలేదన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలొద్దని హితవు పలికారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. నిజాయతీపరుడైన నాయకుడు మనకు ఉన్నాడని తెలిపారు. ప్రశ్నించే హక్కును నాయకులకు, కార్యకర్తలకు జనసేన పార్టీ ఇచ్చిందన్నారు. పీఏసీ సభ్యుడు చిలకం మధుసూదన్రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, వరుణ్, పాణ్యం నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్బాబు, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రేఖా గౌడ్, రాయలసీమ వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు హసీనాబేగం, నాయకులు షేక్ అర్షద్, వరుణ్, మల్లయ్య, వెంకప్ప పాల్గొన్నారు.
* జనసేన నుంచే వీర మహిళగా తమకు పేరు వచ్చిందని కర్నూలు 52వ వార్డుకు చెందిన అనిత అన్నారు. తమ వార్డులో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటోందన్నారు. పాణ్యం నియోజకవర్గానికి చెందిన రేణుక మాట్లాడుతూ జనసేనలో ఉన్నందుకు మెప్మా ఆర్పీ ఉద్యోగం నుంచి తొలగించారన్నారు. సి.బెళగల్కు చెందిన విజయలక్ష్మి మాట్లాడుతూ తాము జనసేన పోస్టర్లు వేసినందుకు గుడిసె తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
బైరెడ్డిపై సెటైర్లు
బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై జనసేన నాయకులు విరుచుకుపడ్డారు. 175 నియోజకవర్గాల పేర్లను జనసేనాని చెప్పాలని సిద్ధార్థరెడ్డి అన్నారని.. ముందుగా ఆయన నందికొట్కూరు నియోజకవర్గంలోని గ్రామాల పేర్లు చెప్పాలని ఎద్దేవా చేశారు. ఉమ్మడి జిల్లాలోని మండలాల పేర్లు చెప్పాలన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. గడప గడపకు కూడా వెళ్లలేని పరిస్థితి సిదార్థరెడ్డికి ఏర్పడిందన్నారు. నందికొట్కూరులో రహదారి విస్తరణ కింద బాధితులకు ఇంత వరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.
సదస్సుకు హాజరైన జనసేన వీర మహిళలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమాన సాగునీరు పారిస్తాం
[ 20-04-2024]
‘‘ఆలూరు దద్దరిల్లింది.. ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు.. ఎన్నికలకు సై అంటూ కర్నూలు కాలు దువ్వుతోంది.. వేదవతి ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకొంటా.. నీటి నిల్వను మూడు టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టు లక్ష్యాన్ని వైకాపా నాశనం చేసింది. -
జగన్ సాయమెంత కౌలు రైతు కలవరింత
[ 20-04-2024]
ఈ మహిళ పేరు అయ్యమ్మ. మండల పరిధిలోని హోసూరుకు చెందిన ఈమె భర్త ఉప్పర తిక్కన్న 2022 ఏప్రిల్ 18న అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. -
జగన్ చోద్యం.. ‘కాడి’తప్పిన కౌలుసేద్యం
[ 20-04-2024]
ముఖ్యమంత్రి గారూ...! మీ ఆత్మబంధువు జగన్ పేరిట 2019 జులై 8న రైతులకు మీరు రాసిన లేఖ గుర్తుందా?... రైతు భరోసా ద్వారా కౌలుదార్లకు మేలు జరగబోతోందని చెప్పారు. మరి నిజంగా ఆదిశగా ఏమైనా చేశారా..? -
వైకాపాను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపాను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆదోని పట్టణం స్థానిక అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. -
ఉల్లంఘనులు
[ 20-04-2024]
అధికారం చేతిలో ఉందని నిబంధనలు లెక్కచేయరు.. ఎన్నికల నియమావళిని పాటించరు.. అధికారులు పట్టించుకోరు.. -
‘జగన్ దగా’ఖానాలు
[ 20-04-2024]
కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వాసుపత్రుల ముఖ చిత్రాలు.. వాటి దశ, దిశ మార్చి ఈ చిత్రాలను కూడా రెండేళ్ల తర్వాత మీ ముందుంచుతాం. -
నామపత్రాల సందడి
[ 20-04-2024]
ఆదోని నియోజకవర్గ భాజపా భాజపా అభ్యర్థిగా డాక్టరు పార్థసారథి శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారి శివ్నారయణశర్మకు తన నామపత్రాన్ని అందజేశారు. -
అభ్యర్థులు.. ఆస్తులు
[ 20-04-2024]
కోడుమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సతీశ్ శుక్రవారం నామపత్రాలు దాఖలు చేశారు. కర్నూలులోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో శేషిరెడ్డికి రెండు సెట్ల పత్రాలు అందజేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు: బీవీ
[ 20-04-2024]
రాష్ట్రంలో యువత ఉద్యోగాలు, అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ తెదేపాను గెలిపించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
రూ.కోట్లకు బీటలు.. రోగులతో జగన్ ఆటలు
[ 20-04-2024]
ఆదోని జిల్లా సర్వజన వైద్యశాలలో వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగులు స్థల భావ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ పరిధిలో 10-15 మండలాలకు ఈ ఆస్పత్రి ప్రధాన ఆధారం. -
చంద్రబాబుకు జననీరాజనం
[ 20-04-2024]
వీధులన్నీ పసుపుమయంగా మారాయి. జనసైనికులు తరలివచ్చారు. కాషాయం కార్యకర్తలు కదలివచ్చారు. కూటమి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఓటు వినియోగంతోనే దృఢమైన ప్రజాస్వామ్యం
[ 20-04-2024]
ప్రతిఒక్కరు ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం దృఢంగా ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. -
ట్యాబు జగన్ డాబు
[ 20-04-2024]
‘ట్యాబ్ల కారణంగా పిల్లలకు చదువులకు ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలు బాగా అర్థమవుతాయి. -
రెండోరోజు 6 నామపత్రాలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండోరోజు శుక్రవారం జిల్లాలో ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
[ 20-04-2024]
ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులు(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా ఎస్సై ఎర్రిస్వామి శుక్రవారం తెలిపారు. -
రెండో రోజు 20 మంది
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం నామినేషన్ల పర్వం కొనసాగింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఒకరు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అభ్యర్థులు తమ నామపత్రాలు సమర్పించారు. -
గుట్టుగా ట్యాబ్ల పంపిణీ
[ 20-04-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్సాహం చూపుతున్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం ట్యాబ్ల పంపిణీ విషయం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా