అక్కలే అమ్మానాన్నలు
పెట్టుబడులు మట్టిలో కలిశాయి.. అప్పులు గుండెల్లో గునపాలయ్యాయి... భారమైన బతుకులతో పెద్దలు ఊరుగాని ఊరెళ్లారు!! అక్షరం మరిస్తే రాత చెదిరిపోతుందని.. ఆ పసి హృదయాలు పల్లెను దాటలేదుఅమ్మానాన్నకు దూరంగా ఉంటున్నారు..
నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం
- న్యూస్టుడే, కౌతాళం
పెట్టుబడులు మట్టిలో కలిశాయి..
అప్పులు గుండెల్లో గునపాలయ్యాయి...
భారమైన బతుకులతో పెద్దలు ఊరుగాని ఊరెళ్లారు!!
అక్షరం మరిస్తే రాత చెదిరిపోతుందని..
ఆ పసి హృదయాలు పల్లెను దాటలేదు
అమ్మానాన్నకు దూరంగా ఉంటున్నారు..
ఇంటి వద్ద ‘అమ్మ’ పాత్ర పోషిస్తున్నారు..
గుండె ధైర్యంతో నాన్న బాధ్యత నిర్వర్తిస్తున్నారు..
పదో తరగతైనా పూర్తికాకుండానే కొందరు బాలికలు జీవిత పాఠం నేర్చుకుంటున్నారు. పెద్దలు వలస పోతే పిల్లలకు ఎదురయ్యే కష్టాలు అనుభవమే.. వారి చదువు పాడవుతుందని తెలుసు.. అయినా సరే అప్పులు తీర్చే మార్గంలేక సుగ్గికిపోతున్నాయి పశ్చిమ పల్లెలు. బడి కోసం బిడ్డలను ఇక్కడే వదిలేసి ఎందరో ఉపాధి బాట పట్టారు. అమ్మానాన్నల తోడులేని ఆ బాలికలు చదువుతున్న జీవిత పాఠం వింటుంటే భళా అనిపిస్తోంది.!!
ఆరు గంటలకు లేచి అన్నం వండి
కంటతడి పెడుతున్న చిన్నారులు
బతకడానికి అమ్మానాన్నలు హైదరాబాద్ వెళ్లారు. నేను, చెల్లి గ్రామంలోనే ఉంటున్నాం. గోతులదొడ్డిలోని పాఠశాలలో నేను ఆరో తరగతి, చెల్లి మల్లిక నాలుగో తరగతి చదువుతున్నాం. ఉదయం, రాత్రి నేనే వంట చేస్తా. మధ్యాహ్నం బడిలో తింటాం. ఇల్లు శుభ్రం చేయడం.. నీళ్లు తేవడం అన్ని పనులు నేనే చేస్తా. పప్పు వండటం రాదు.. ఎక్కువగా టమాట, ఉల్లిగడ్డ, ఆకుకూరలతో కూరలు చేస్తా. కూరగాయలు కొనుక్కోవడానికి మా వద్ద రూ.200 ఉన్నాయి. బడిలేనప్పుడు కూలి పనులకెళ్తా. ఇంటి పక్కనే అవ్వాతాతల ఇల్లు ఉంది. రాత్రివేళ అక్కడికి వెళ్తాం. అమ్మ గుర్తుకొచ్చినప్పుడు చెల్లిని ఓదార్చలేకపోతున్నా.. ఫోన్లో మాట్లాడాలనుకుంటాం. మా వద్ద ఫోన్ లేదు.’’ అంటూ గాయత్రి కంటతడి పెట్టింది.
అవ్వ.. తమ్ముడికి ఆధారం
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. నాన్న పెద్ద హనుమంతు, అమ్మ గుంటెమ్మలు మిరప పనుల నిమిత్తం గుంటూరుకు వెళ్లారు. ఇద్దరు తమ్ముళ్లను వెంట తీసుకెళ్లారు. మరో తమ్ముడు హర్షవర్ధన్ను నా వద్దే ఉంచి వెళ్లారు. కళ్లు కనిపించని అవ్వ, తమ్ముడిని నేనే చూసుకుంటున్నా. ఉదయం 6 గంటలకే లేచి ఇళ్లంతా శుభ్రం చేస్తా. వంట చేసి తమ్ముడు, అవ్వకు తినిపించి కోసిగి మండల కేంద్రం పల్లెపాడులోని జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్తాను. మధ్యాహ్నం బడిలో భోజనం చేసి వెంటనే ఇంటికొచ్చి అవ్వకు తినిపించి మళ్లీ వెళ్తా. సాయంత్రం వచ్చాక.. ఇంటి, వంట పనులు చేస్తా’’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది పద్మావతి
న్యూస్టుడే, ఎమ్మిగనూరు
చెల్లి ఏడుస్తుందని దుఃఖాన్ని దిగమింగుకుని
గాయత్రి
అమ్మ నాగలక్ష్మి, నాన్న హనుమంతు సుగ్గికెళ్లారు. వారితోపాటు ఇద్దరు అన్నయ్యలను తీసుకెళ్లారు. నేను, చెల్లి అవ్వా, తాతల వద్ద ఉంటున్నాం. కోసిగి మండల కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నేను ఏడో తరగతి చదువుతున్నా. చెల్లెలు శీర్షిక ఒకటో తరగతిలో ఉంది. మిరప పనులకెళ్లి డబ్బులు తెస్తామని అమ్మ చెప్పింది.. రోజూ బడికెళ్లి బాగా చదువుకోవాలని.. ఇంట్లో అవ్వకు తోడుగా ఉండాలంది. మంచినీరు, కిరాణా సరకులు నేనే తెస్తా. చెల్లెలికి స్నానం చేయించి బడికి తీసుకెళ్తా. అమ్మా కోసం చెల్లెలు ఏడిస్తే కొత్త దుస్తులు, చెప్పులు తేవడానికి వెళ్లారని ఓదారుస్తా. అమ్మ ఇంట్లో లేకపోతే ఏడుపొస్తోంది. నేను ఏడిస్తే చెల్లి ఏడుస్తుంది.. అందుకే దుఃఖాన్ని దిగమింగుకుంటున్నా.’’ అంటోంది గాయత్రి
న్యూస్టుడే, కోసిగి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!