అక్కలే అమ్మానాన్నలు
పెట్టుబడులు మట్టిలో కలిశాయి.. అప్పులు గుండెల్లో గునపాలయ్యాయి... భారమైన బతుకులతో పెద్దలు ఊరుగాని ఊరెళ్లారు!! అక్షరం మరిస్తే రాత చెదిరిపోతుందని.. ఆ పసి హృదయాలు పల్లెను దాటలేదుఅమ్మానాన్నకు దూరంగా ఉంటున్నారు..
నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం
- న్యూస్టుడే, కౌతాళం
పెట్టుబడులు మట్టిలో కలిశాయి..
అప్పులు గుండెల్లో గునపాలయ్యాయి...
భారమైన బతుకులతో పెద్దలు ఊరుగాని ఊరెళ్లారు!!
అక్షరం మరిస్తే రాత చెదిరిపోతుందని..
ఆ పసి హృదయాలు పల్లెను దాటలేదు
అమ్మానాన్నకు దూరంగా ఉంటున్నారు..
ఇంటి వద్ద ‘అమ్మ’ పాత్ర పోషిస్తున్నారు..
గుండె ధైర్యంతో నాన్న బాధ్యత నిర్వర్తిస్తున్నారు..
పదో తరగతైనా పూర్తికాకుండానే కొందరు బాలికలు జీవిత పాఠం నేర్చుకుంటున్నారు. పెద్దలు వలస పోతే పిల్లలకు ఎదురయ్యే కష్టాలు అనుభవమే.. వారి చదువు పాడవుతుందని తెలుసు.. అయినా సరే అప్పులు తీర్చే మార్గంలేక సుగ్గికిపోతున్నాయి పశ్చిమ పల్లెలు. బడి కోసం బిడ్డలను ఇక్కడే వదిలేసి ఎందరో ఉపాధి బాట పట్టారు. అమ్మానాన్నల తోడులేని ఆ బాలికలు చదువుతున్న జీవిత పాఠం వింటుంటే భళా అనిపిస్తోంది.!!
ఆరు గంటలకు లేచి అన్నం వండి
కంటతడి పెడుతున్న చిన్నారులు
బతకడానికి అమ్మానాన్నలు హైదరాబాద్ వెళ్లారు. నేను, చెల్లి గ్రామంలోనే ఉంటున్నాం. గోతులదొడ్డిలోని పాఠశాలలో నేను ఆరో తరగతి, చెల్లి మల్లిక నాలుగో తరగతి చదువుతున్నాం. ఉదయం, రాత్రి నేనే వంట చేస్తా. మధ్యాహ్నం బడిలో తింటాం. ఇల్లు శుభ్రం చేయడం.. నీళ్లు తేవడం అన్ని పనులు నేనే చేస్తా. పప్పు వండటం రాదు.. ఎక్కువగా టమాట, ఉల్లిగడ్డ, ఆకుకూరలతో కూరలు చేస్తా. కూరగాయలు కొనుక్కోవడానికి మా వద్ద రూ.200 ఉన్నాయి. బడిలేనప్పుడు కూలి పనులకెళ్తా. ఇంటి పక్కనే అవ్వాతాతల ఇల్లు ఉంది. రాత్రివేళ అక్కడికి వెళ్తాం. అమ్మ గుర్తుకొచ్చినప్పుడు చెల్లిని ఓదార్చలేకపోతున్నా.. ఫోన్లో మాట్లాడాలనుకుంటాం. మా వద్ద ఫోన్ లేదు.’’ అంటూ గాయత్రి కంటతడి పెట్టింది.
అవ్వ.. తమ్ముడికి ఆధారం
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. నాన్న పెద్ద హనుమంతు, అమ్మ గుంటెమ్మలు మిరప పనుల నిమిత్తం గుంటూరుకు వెళ్లారు. ఇద్దరు తమ్ముళ్లను వెంట తీసుకెళ్లారు. మరో తమ్ముడు హర్షవర్ధన్ను నా వద్దే ఉంచి వెళ్లారు. కళ్లు కనిపించని అవ్వ, తమ్ముడిని నేనే చూసుకుంటున్నా. ఉదయం 6 గంటలకే లేచి ఇళ్లంతా శుభ్రం చేస్తా. వంట చేసి తమ్ముడు, అవ్వకు తినిపించి కోసిగి మండల కేంద్రం పల్లెపాడులోని జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్తాను. మధ్యాహ్నం బడిలో భోజనం చేసి వెంటనే ఇంటికొచ్చి అవ్వకు తినిపించి మళ్లీ వెళ్తా. సాయంత్రం వచ్చాక.. ఇంటి, వంట పనులు చేస్తా’’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది పద్మావతి
న్యూస్టుడే, ఎమ్మిగనూరు
చెల్లి ఏడుస్తుందని దుఃఖాన్ని దిగమింగుకుని
గాయత్రి
అమ్మ నాగలక్ష్మి, నాన్న హనుమంతు సుగ్గికెళ్లారు. వారితోపాటు ఇద్దరు అన్నయ్యలను తీసుకెళ్లారు. నేను, చెల్లి అవ్వా, తాతల వద్ద ఉంటున్నాం. కోసిగి మండల కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నేను ఏడో తరగతి చదువుతున్నా. చెల్లెలు శీర్షిక ఒకటో తరగతిలో ఉంది. మిరప పనులకెళ్లి డబ్బులు తెస్తామని అమ్మ చెప్పింది.. రోజూ బడికెళ్లి బాగా చదువుకోవాలని.. ఇంట్లో అవ్వకు తోడుగా ఉండాలంది. మంచినీరు, కిరాణా సరకులు నేనే తెస్తా. చెల్లెలికి స్నానం చేయించి బడికి తీసుకెళ్తా. అమ్మా కోసం చెల్లెలు ఏడిస్తే కొత్త దుస్తులు, చెప్పులు తేవడానికి వెళ్లారని ఓదారుస్తా. అమ్మ ఇంట్లో లేకపోతే ఏడుపొస్తోంది. నేను ఏడిస్తే చెల్లి ఏడుస్తుంది.. అందుకే దుఃఖాన్ని దిగమింగుకుంటున్నా.’’ అంటోంది గాయత్రి
న్యూస్టుడే, కోసిగి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పత్తికొండలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
సెబ్ పోలీసుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సెబ్ సూపరింటెండెంట్ ఎస్.రవి కుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, అక్రమ మద్యం రవాణా అమ్మకాలపై పత్తికొండ, కర్నూలు పోలీసులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. -
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ