గణతంత్ర పుటలు చదివిద్దాం
జలియన్వాలాబాగ్ దుర్ఘటనలో ప్రాణాలు పోతున్నా భారత్మాతాకీ జై అని నినదించిన భారతీయులను అడుగు దేశభక్తి అంటే చెబుతుంది.!!
నేడు వసంత పంచమి
నేడు రిపబ్లిక్ డే ఉత్సవాలు
జలియన్వాలాబాగ్ దుర్ఘటనలో ప్రాణాలు పోతున్నా భారత్మాతాకీ జై అని నినదించిన భారతీయులను అడుగు దేశభక్తి అంటే చెబుతుంది.!!
అహింస మార్గంలోనే స్వాతంత్య్రం తేవాలని తెల్లదొరల లాఠీదెబ్బలకు వెరవని మహాత్ముడి ఆత్మవిశ్వాసాన్ని అడుగు దేశభక్తి అంటే వివరిస్తుంది.!!
భరతమాత స్వేచ్ఛ కోరి ఉరికంభం ఎక్కిన భగత్సింగ్ ఆఖరి శ్వాసను అడుగు దేశభక్తి అంటే తెలుపుతుంది.!!
మనందరిని విముక్తులను చేయడానికి తుపాకి గుండుకే గుండె చూపిన అల్లూరి, ఆంధ్రకేసరి ధైర్యాన్ని అడుగు దేశభక్తి అంటే చూపుతుంది.!!
న్యూస్టుడే, నంద్యాల పట్టణం
సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్వారిపై జిల్లా వాసులు పోరాడారు. ప్రజలు స్వేచ్ఛా వాయువును పీల్చుకునేందుకు, బానిస బతుకుల నుంచి విముక్తి కల్పించడానికి ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు ఆంగ్లేయులకు ఎదురొడ్డారు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, వనం శంకర శర్మ, నివర్తి వెంకట సుబ్బయ్య.. ఇలా చాలా మంది నాయకత్వం వహించి ప్రజలను ఏకం చేయ సాగారు. ఇలాంటి చరిత్రను నేటి విద్యార్థులు చెప్పలేకపోతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియడం లేదు.. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులు కనీసం రెండు దేశభక్తి గీతాలూ పాడలేకపోతున్నట్లు ‘న్యూస్టుడే’ సర్వేలో తేలింది. సమరయోధుల చరిత్రను నేటి తరం తెలుసుకొనేలా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాల్సినవసరం ఉంది. నేడు వసంత పంచమి... చదువులతల్లి సరస్వతీ పుట్టినరోజు. ఈ రోజు విద్యాభ్యాసం మొదలుపెడితే విద్యార్థులు ఉన్నత విద్యావంతులు అవుతారనేది చాలా మంది నమ్మకం. తల్లిదండ్రులు వసంత పంచమి రోజును సరస్వతీ దేవి చెంత అక్షరాలు దిద్దించి, అన్నప్రాసనలు చేయిస్తారు. తల్లిదండ్రులంతా తమ పిల్లలకు దేశ స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలు, మహనీయుల చరిత్రలు నేర్పించడానికి శ్రీకారం చుట్టాల్సినవసరం ఉంది.
దేశభక్తి.. క్రమశిక్షణ
1 విద్యార్థి దశ నుంచే దేశభక్తి, క్రమశిక్షణ నేర్పడంతోపాటు సామాజిక అంశాల్లో తర్ఫీదు ఇచ్చి వారి ఉజ్వల భవిష్యత్తు బాటలు వేయడమే ఎన్సీసీ లక్ష్యం. 2011లో కర్నూలు గ్రూప్ ఆఫీసు ఏర్పాటైంది. ఈ గ్రూపులో కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు ఉంటారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8, 9 తరగతులు చదివే విద్యార్థులు ఎన్సీసీలో చేరే అవకాశం ఉంటుంది.
2 కర్నూలులో 21 ప్రభుత్వ, 20 ప్రైవేటు పాఠశాలల్లో 2,403 మంది, నంద్యాల జిల్లా పరిధిలో 6 ప్రభుత్వ, 5 ప్రైవేటు బడుల్లో చదివే 600, ఆదోని పరిధిలో 6 ప్రభుత్వ, 1 ప్రైవేటు పాఠశాలలో చదివే 522 మంది బాలబాలికలు ఎన్సీసీలో ఉన్నారు. వీరికి రెండేళ్లపాటు సాగే శిక్షణలో పలు అంశాల్లో తర్ఫీదు ఇస్తారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎన్సీసీ క్యాంపులు నిర్వహిస్తారు.
3 రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన తర్వాత ఫిబ్రవరి నెలలో ఎ.సర్టిఫికెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి ఏబీసీ గ్రేడ్ కేటాయిస్తారు. రైఫిల్ షూటింగ్, కవాతులో ప్రతిభ చూపిన వారిని దిలీలో జరిగే శిబిరానికి పంపుతారు. వీరికి ఉన్నత చదువులు, రక్షణ రంగంలో 2 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఎ.సర్టిఫికెట్ పొంది చాలా మంది యువకులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పెద్దఎత్తున సాధించారు.
ఫిజికల్ ఫిట్నెస్కు ప్రాధాన్యం : విజయ్కుమార్, చీఫ్ ఆఫీసర్.. ఏఎన్వో
ఎన్సీసీలో చేరే వ్యక్తి ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇచ్చేలా తీర్చిదిద్దుతాం. వారి చేతులపై పచ్చ బొట్లు ఉండకూడదు. మోకాళ్లు ఆనుకోకుండా ఉండాలి. వారినే ఎన్సీసీలో చేర్చుకుంటాం. జవాన్ల సమక్షంలో ఏడాదికి 40 తరగతుల చొప్పన శిక్షణ ఇప్పిస్తాం. దేశభక్తి పెంపొందించేలా శిక్షణ ఉంటుంది.
ఆరులో సైనిక్ పాఠాలు
సైనిక్ పాఠశాలలు.. సాయుధ దళాల్లో చేరేలా ఆరో తరగతి నుంచే విద్యార్థులను శారీరకంగా, మానసికంగా సన్నద్ధం చేసే పాఠశాలలు. వీటిల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ఏటా వేలాది మంది పోటీ పడుతుంటారు. సీట్లు పరిమితిగా ఉండటంతో కొందరికే అవకాశం దక్కుతోంది. ఇక్కడ సీటు సంపాదిస్తే భవిష్యత్తులో త్రివిధ దళాల్లో ప్రవేశం దాదాపు ఖరారైనట్లే. యాభై ఏళ్ల క్రితం దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ప్రత్యేకంగా సైనిక స్కూల్ సొసైటీ నెలకొల్పారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు రెసిడెన్షియల్ విధానంలో సీబీఎస్ఈ విద్యా బోధన అందిస్తారు. చదువుతోపాటు విద్యార్థుల్లో ధైర్య సాహసాలు నూరిపోస్తూ.. త్రివిధ దళాల్లో చేరేలా స్కూల్ స్థాయి నుంచే క్రమశిక్షణ నేర్పడం వీటి ప్రధాన ఉద్దేశం. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న సైనిక్ పాఠశాలలకు సంబంధించి సంస్కరణల దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం దేశంలో 33 సైనిక్ పాఠశాలలు ఉండగా.. వీటిల్లో ఏటా మూడు వేల మంది ఆరో తరగతిలో ప్రవేశం పొందుతున్నారు. ప్రస్తుతం పది శాతం సీట్లు బాలికలకే కేటాయించారు.
నేవీ రంగంలో అడుగుపెడతా : హేమంత్, కల్లూరు
సైనిక్ పాఠశాలల్లో ప్రవేశాల నిమిత్తం 2016లో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో 37వ ర్యాంకు సాధించా. కలికిరి సైనిక్ స్కూల్ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశం పొందా. సీటు ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించడంతో సీటు వచ్చింది. ప్రస్తుతం 12వ తరగతి (ఎంపీసీ) చదువుతున్నా. పాఠశాలలో అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఒకేచోట ఉండటంతో హిందీ, ఇంగ్లిషు భాషల్లో అనర్గళంగా మాట్లాడటం. సాధారణ విద్యార్థుల కంటే దృఢంగా.. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్నా. నేవీ, ఎయిర్పోర్సు, మిలిటరీలో అర్హత సాధించేందుకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష రాస్తున్నా. అందులో ఉత్తీర్ణత సాధిస్తే నేవీ రంగం వైపు వెళ్లాలని ఉంది.
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే
రైఫిల్ షూటింగ్పై దృష్టి పెట్టా
-సాయికుమార్ స్వామి, ఎన్సీసీ విద్యార్థి
కర్నూలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నా. ఎన్సీసీలో చేరేదాకా లక్ష్యం అంటూ ఏమీ లేదు.. ఇందులో చేరాక రైఫిల్ షూటింగ్ మీద ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్సీసీ నిర్వహించిన పలు శిబిరాల్లో రైఫిల్ షూటింగ్లో పాల్గొని మొదటి స్థానం సాధించి దిల్లీకి సైతం వెళ్లి వచ్చా. ఇక్కడితో నా ప్రయాణం ఆగలేదు. అసోసియేషన్ నిర్వహించే పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఎన్సీసీలో చేరకపోయి ఉంటే.. లక్ష్యమంటూ ఉండేది కాదు.
దేశ రక్షణతోపాటు..
- కల్నల్ ఎన్.రమేష్, కర్నూలు గ్రూప్ కమాండర్
ఎన్సీసీలో చేరితే విద్యార్థి దశ నుంచే దేశభక్తి పెంపొందించడంతోపాటు సామాజిక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఉంటుంది. వెపన్తో తర్ఫీదు.. విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం.. తదితర అంశాల్లో జవాన్లు శిక్షణ ఇస్తారు. పాఠశాల స్థాయిలో 8వ తరగతిలో ప్రవేశం ఉంటుంది. రెండేళ్లపాటు కోర్సు పూర్తి చేసిన వారికి పరీక్ష నిర్వహించి ఎ.సర్టిఫికెట్ జారీ చేస్తాం. పరీక్ష రాసేవారు తప్పనిసరిగా 15 రోజులపాటు సాగే ఎన్సీసీ క్యాంపులో పాల్గొనాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ పొందిన ఎన్సీసీ విద్యార్థికి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో 2 శాతం రిజర్వేషన్ ఉంటుంది. దిల్లీ వెళ్లి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?