జగన్మోహన్రెడ్డి పాలనలో ఉద్యోగావకాశాలు కరవు
జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రంలో చదువుకున్న యువకులకు ప్రభుత్వ కొలువులు లేక, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే దుస్థితి నెలకొందని తెదేపా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ బాధ్యులు టి.జి.భరత్ అన్నారు.
కొబ్బరికాయలు కొడుతున్న సోమిశెట్టి, టి.జి.భరత్
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రంలో చదువుకున్న యువకులకు ప్రభుత్వ కొలువులు లేక, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే దుస్థితి నెలకొందని తెదేపా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ బాధ్యులు టి.జి.భరత్ అన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఈనెల 27 నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్ర పూర్తిస్థాయిలో విజయవంతం కావాలని కోరుతూ తెదేపా కర్నూలు పార్లమెంట్ అనుబంధ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేశ్ సంపూర్ణ ఆరోగ్యంతో పాదయాత్ర నిరాటంకంగా, నిర్విఘ్నంగా సాగాలని కోరారు. బుధవారం కర్నూలు నగరంలోని వినాయక ఆలయంలో టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు నర్సింహులు ఆధ్వర్యంలో వినాయకుడికి, సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ ఆలయంలో కర్నూలు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు ఆధ్వర్యంలో సోమిశెట్టి, భరత్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్రంలో యువతకు ధైర్యాన్నిచ్చి, రానున్న రోజులలో వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రకు పూనుకున్నారని అన్నారు. 400 రోజులు, 4 వేల కిలోమీటర్ల మేర నిరాటంకంగా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసిన సందర్భంలో తెదేపా ప్రభుత్వం వారికి అన్ని అనుమతులు ఇచ్చామని, నేడు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో పోలీసు అధికారులు డీజీపీ లోకేశ్ పాదయాత్రకు అనుమతులివ్వడంలో లేనిపోని నిబంధనలు విధిస్తున్నారని వాపోయారు. పోలీసు అధికారులూ ఏకపక్షంగా వ్యవహరించకుండా చూడాలని, లక్షలాది మంది కార్యకర్తలు, యువకులు పాల్గొననున్న కార్యక్రమానికి నిబంధనల మేరకు తగిన రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసు అధికారులదేనన్నారు. లోకేశ్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సోమిశెట్టి నవీన్, నందిమధు, శివరాజప్ప, పరమేష్, గున్నామార్క్, హనుమంతరావు చౌదరి, టీఎన్టీయుసీ నాయకులు అశోక్కుమార్, నగేష్, సుంకన్న, బి.వి రమణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అడ్డంకులు సృష్టించినా.. లోకేశ్ పాదయాత్ర ఆగదు
ఆదోనిలో విలేకరులతో మాట్లాడుతున్న ఆదోని తెదేపా బాధ్యుడు మీనాక్షినాయుడు
ఆదోని గ్రామీణం, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27వ తేదీన చేపడుతున్న పాదయ్రాత ఆగదని ఆదోని నియోజకవర్గ బాధ్యుడు మీనాక్షినాయుడు అన్నారు. ఆదోనిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో చాలా మంది నాయకులు పాదయాత్రలు చేశారని, చేస్తున్నారు. ఎవరికీ లేని అడ్డంకులు లోకేశ్కే ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేయడం సాధారణం అన్నారు. 400 రోజులు పాదయాత్ర సాగుతుందని, ఇందు కోసం తెదేపా కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆదోని నియోజవర్గంలో ఈ నెల 27వ తేదీన పాదయాత్రకు సంఘీభావంగా ఎన్టీఆర్కు నివాళి అర్పించి, రెండో పట్టణ పోలీసు స్టేషన్ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం సంఘీభావ ర్యాలీ ఉంటుందన్నారు. కార్యక్రమానికి తెదేపా కార్యకర్తలు, నాయకులు, నందమూరి అభిమానులు హాజరు కావాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి నియంతలా వ్యవరిస్తున్నారన్నారు. సమావేశంలో తెదేపా నాయకులు గోపాల్, బుద్దారెడ్డి, తిమ్మప్ప, లక్ష్మీనారాయణ, జయరాం, మల్లికార్జున, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఆంక్షలు విధించడం సరికాదు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గుండెల్లో లోకేశ్ పాదయాత్ర వణుకు పుట్టిస్తుందని ఆదోని తెదేపా సీనియర్ నాయకులు భాస్కర్రెడ్డి, దేవేంద్రప్ప, ఫకృద్దీన్, రామస్వామి, తెదేపా మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ అన్నారు. యువగళానికి ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరి కాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM