చేదోడు గడువు గడబిడ
వైఎస్సార్ చేదోడు పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం కేవలం మూడ్రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
వెల్దుర్తి-2 సచివాలయానికి చేదోడు పథకం దరఖాస్తు చేసేందుకు వచ్చిన జనం
కర్నూలు సంక్షేమం, వెల్దుర్తి, న్యూస్టుడే : వైఎస్సార్ చేదోడు పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం కేవలం మూడ్రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అవసరమైన పత్రాలు అందుబాటులో లేకపోవడం.. సమయం తక్కువగా ఉండటం.. దీనికితోడు సర్వర్ సమస్య వేధిస్తుండటంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 26,411 మంది రెన్యువల్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కర్నూలు జిల్లా నుంచి 12,856 మంది, నంద్యాల జిల్లా నుంచి 13,556 మంది ఉన్నారు. కొత్తగా 3,743 మంది దరఖాస్తులు ఇచ్చారు.
మూడు రోజుల సమయం
* వైఎస్సార్ చేదోడు పథకం కింద రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, వివిధ కులవృత్తి పనులు చేసుకుంటూ 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న తెల్లరేషన్ కార్డుదారులు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులకు ఏటా రూ.10 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది.
* దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 23న ఆదేశాలు ఇచ్చింది. ఆరోజు చాలామందికి విషయం తెలియని పరిస్థితి. 26వ తేదీ సెలవు కావడం.. కేవలం 24, 25, 27 తేదీల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు.
కొర్రీలు పెట్టి కోతలు
ఇల్లు మారినా.. దుకాణాన్ని మార్చినా ఆ ప్రాంతంలోని సచివాలయం నుంచే దరఖాస్తు చేసుకోవాల్సి రావడంతో సమస్యలు ఎదురయ్యాయి. గతంలో రెండుసార్లు లబ్ధి పొందినవారు కొత్త సచివాలయం నుంచి దరఖాస్తు చేసుకుంటే కొత్త దరఖాస్తు కింద నమోదు చేయాల్సి వచ్చింది. పాత సచివాలయం నుంచి రెన్యువల్ చేసుకొనేందుకు వీలుకాని పరిస్థితి. ప్రధానంగా సచివాలయాల నుంచి ఎంపీడీవో కార్యాలయాలకు.. అక్కడినుంచి బీసీ కార్పొరేషన్కు పంపేందుకు సర్వర్ సమస్యలు లేర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వెయ్యి మందికిపైగా అర్హులైనవారు, రెన్యువల్ చేసుకునేవారు దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు సమాచారం.
సర్వర్ సతాయింపు
వైఎస్సార్ చేదోడు పథకం లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రజలకు సర్వర్ మొరాయింపుతో నిరాశ చెందారు. చేదోడు పథకం పొందేందుకు కేవలం మూడు రోజుల గడువు ఇవ్వడంతో చాలామంది ఆందోళనలో మునిగిపోయారు. పథకం పొందాలంటే కొత్తగా లేబర్, కుల, ఆదాయ ధ్రువపత్రాలు అవసరమని చెప్పడంతో వాటి కోసం సచివాలయాలు, తహసీˆల్దార్ కార్యాలయాలకు పరుగులు తీశారు. సర్వర్ సమస్యకుతోడు ధ్రువపత్రాలు అందక పలువురు అర్హత కోల్పోవాల్సి వచ్చింది.
అదనంగా వసూళ్లు
కర్నూలు జిల్లాలో పరిశీలిస్తే శుక్రవారం సాయంత్రం 4.30 సమయంలో 695 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వెల్దుర్తిలోని మూడు సచివాలయాల్లో దాదాపు 15 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. లబ్ధిదారుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న సచివాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వెల్దుర్తి-3 సచివాలయంలో లేబర్ ధ్రువపత్రానికి రూ.140 తీసుకోవాల్సి ఉండగా రూ.200 వసూలు చేసినట్లు పలువురు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రంలోగా దరఖాస్తులు అప్లోడ్ చేయాలని ఆదేశాలు ఉండటంతో ధ్రువపత్రాలు అందక చాలా మంది తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ విషయమై బీసీ కార్పొరేషన్ ఈడీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్హులైవారందరికీ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
మూడు రోజుల కిందట సమాచారం : హుసేన్బాషా, గురుమూర్తి, బుక్కాపురం
జగనన్న చేదోడు పథకం పొందేందుకు మూడు రోజుల కిందట సమాచారం అందించారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం కావడంతో కార్యాలయం పనిచేయలేదు. ఈనెల 27 మధ్యాహ్నానికి ధ్రువపత్రాలు అందించాలని చెప్పారు. గతంలో తీసుకున్న కుల ధ్రువపత్రం చెల్లదన్నారు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు తహసీˆల్దార్ కార్యాలయానికి వచ్చాం. సర్వర్ సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నుల పండుగగా బెలడోనా భీమలింగేశ్వర స్వామి రథోత్సవం
[ 25-04-2024]
మండలంలోని బెలడోనా గ్రామంలో వెలిసిన భీమ లింగేశ్వర స్వామి రథోత్సవం గురువారం కన్నుల పండుగగా జరిగింది. -
ముగిసిన బండలాగుడు పోటీలు
[ 25-04-2024]
మండలంలోని రామళ్ళకోట గ్రామంలో వనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా గురువారం బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పత్తికొండలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
సెబ్ పోలీసుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సెబ్ సూపరింటెండెంట్ ఎస్.రవి కుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, అక్రమ మద్యం రవాణా అమ్మకాలపై పత్తికొండ, కర్నూలు పోలీసులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. -
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట