ప్రాథమిక పాఠానికి సర్దుపాట్లు
ఉపాధ్యాయుల పదోన్నతులు, సర్దుబాటు ప్రక్రియ ప్రాథమిక విద్యను ప్రశ్నార్థకంగా మార్చాయి. పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
నంద్యాల పట్టణం, న్యూస్టుడే: ఉపాధ్యాయుల పదోన్నతులు, సర్దుబాటు ప్రక్రియ ప్రాథమిక విద్యను ప్రశ్నార్థకంగా మార్చాయి. పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఉమ్మడి జిల్లాలో 1404 మంది ఉపాధ్యాయులను పదోన్నతులతో బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం 70 శాతం పదోన్నతులు, 30 శాతం నేరుగా నియామకాలు చేపట్టాలి. నిబంధనలు పాటించకపోవడం ప్రాథమిక విద్యపై ప్రభావంపై పడింది. ఎస్జీటీల కొరత ఉండటంతో మూడో తరగతి నుంచి సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5వ తరగతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు తరలించింది. ఎస్జీటీలకు పదోన్నతుల పేరుతో నిర్వహించిన క్రతువుతో చాలా పాఠశాలల్లో బోధన కరవయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 25 మంది విద్యార్థుల సంఖ్య దాటితే మరో ఉపాధ్యాయున్ని నియమించాలనే నిబంధన ఉండగా, ప్రస్తుతం జరిగిన పదోన్నతులతో చాలా పాఠశాలల్లో 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉండగా ఏకోపాధ్యాయుడే బోధన చేయాల్సిన పరిస్థితులొచ్చాయి.
ఐదు తరగతులకు ఒక్కరే
పాఠశాలలో ఒకే ఉపాధ్యాయురాలు
గోనెగండ్ల ప్రాథమిక పాఠశాల(బీసీ)లో ఐదో తరగతి వరకు 65 మంది చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు పదోన్నతి రావడంతో మరో చోటికి బదిలీ అయ్యారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో శుక్రవారం అత్యవసరంగా డిప్యుటేషన్పై ఓ ఉపాధ్యాయురాలిని నియమించారు. ఆమె ఐదు తరగతులకూ బోధించలేక ఇబ్బంది పడ్డారు. రెండు గదులున్నా., ఒక గదిలో నిర్మాణ సామగ్రి ఉంచడంతో మరో గదిలో, వరండాలోనూ పిల్లలను ఉంచి పాఠాలు చెప్పాల్సి వచ్చింది. మరో ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
న్యూస్టుడే, గోనెగండ్ల
ఎక్కడెక్కడ ఎలా ఉందంటే
* దేవనకొండ మండలం మాదాపురం, జిల్లెడబుడకల ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేని పరిస్థితి ఏర్పడింది. బండిఆత్మకూరు మండలం బరకాల, కడమలకాల్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు రాగా ఇక్కడ డిప్యుటేషన్పై ఎస్జీటీలను పంపించేందుకు అధికారులు కుస్తీ పడుతున్నారు.
* వెలుగోడు మండలంలో 11 మంది పదోన్నతులపై వెళ్లగా నలుగురు ఉపాధ్యాయులను ఆయా స్థానాల్లో భర్తీ చేశారు. బోయరేవుల పాఠశాలల్లో 76 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా ఒకరు పదోన్నతిపై వెళ్లగా ఇద్దరు మిగిలారు.
* పాణ్యం మండలం వొడ్డుగండ్ల ప్రాథమిక పాఠశాలల్లో 35 మంది విద్యార్థులుండగా, ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు పదోన్నతిపై వెళ్లగా ఒక్కరే మిగిలారు. నెరవాడ పాఠశాల నుంచి ఒకరు పదోన్నతిపై వెళ్లగా 45 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడే పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్.కొత్తూరు పాఠశాలలోనూ ఇదే పరిస్థితి.
* గడివేముల మండలం గగ్గటూరులో ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరికి పదోన్నతి లభించగా మరో ఉపాధ్యాయుడు అవసరం ఏర్పడింది. ఈ మండలంలో ఆరు చోట్ల ఉపాధ్యాయుల అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశ పర్యటనకు బయలుదేరిన అహోబిలం పీఠాధిపతి
[ 29-03-2024]
అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ దేశ పర్యటనకు బయలుదేరారు. -
ఆలూరు నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగరవేస్తాం
[ 29-03-2024]
ఆలూరు నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ను గెలిపించి తెదేపా జెండా ఎగరవేస్తామని ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ ఉపాధ్యక్షులు సాలి సాహెబ్, మండల తెదేపా నాయకులు సతీష్ కుమార్ అన్నారు. -
రానున్న ఎన్నికల్లో తెదేపాదే అధికారం
[ 29-03-2024]
బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెదేపా పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
ఎమ్మిగనూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
పట్టణంలోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. -
ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర గౌడ్
[ 29-03-2024]
ఆలూరు తెదేపా అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ను అదిష్ఠానం ప్రకటించింది. దీనికి సంబంధించి శుక్రవారం జాబితాను విడుదల చేసింది. -
ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకుందాం
[ 29-03-2024]
ఆదోని పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. -
ఆలూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలూరులో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పార్టీ డాక్టర్ సెల్ కార్యదర్శి నెట్టెప్ప ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
[ 29-03-2024]
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
తెదేపాతోనే పేదలకు న్యాయం
[ 29-03-2024]
తెదేపాతోనే పేద, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి నర్సప్ప అన్నారు. -
సీ బెళగల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
మండలకేంద్రమైన సీ బెళగల్లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా