logo

పెళ్లింట విషాదం

కుమారుడి నిశ్చితార్థ వేడుకతో ఆ ఇంట్లో కలిగిన ఆనందం.. కొన్ని గంటల్లోనే తొలగి పోయింది. వరుడి తండ్రి గుండెపోటుకు గురై మరణించడంతో విషాదం అలుముకుంది.

Published : 28 Jan 2023 01:48 IST

ధర్మన్న(పాత చిత్రం)

మంత్రాలయం , న్యూస్‌టుడే: కుమారుడి నిశ్చితార్థ వేడుకతో ఆ ఇంట్లో కలిగిన ఆనందం.. కొన్ని గంటల్లోనే తొలగి పోయింది. వరుడి తండ్రి గుండెపోటుకు గురై మరణించడంతో విషాదం అలుముకుంది.  మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన ధర్మన్న, లక్ష్మిలకు నలుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసిన ఆయన శుక్రవారం ఉదయం కుమారుడు మల్లేశ్‌కు నిశ్చితార్థం చేయాలనుకున్నారు. అయితే ధర్మన్నకు అనారోగ్యంగా ఉండడంతో తండ్రితోపాటు తల్లిని అతడికి తోడుగా ఇంటి వద్దే ఉంచి, మిగిలిన కుటుంబీకులంతా ఇబ్రహీంపురంలో మల్లేశ్‌ నిశ్చితార్థ వేడుకకు వెళ్లారు. వధువు ఇంట్లో జరిగే వేడుకల్లో వారంతా సంతోషంగా ఉండగానే.. ఇంటివద్ద ఉన్న తండ్రి ధర్మన్న(50)కు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించేలోగా ఆయన మృతి చెందారు. అప్పటికే సంతోషంగా ఉన్న కుమారుడు, కుటుంబీకులు విషయం తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు. పరుగున గ్రామానికి చేరుకుని కంటతడి పెట్టారు. నెల రోజుల్లో కుమారుడి వివాహం చూడాలన్న కోరిక తీరకుండా తండ్రి చనిపోయాడని ఇంటిల్లిపాదీ విలపించడం స్థానికులను కలచివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు