అక్రమ అంతస్తులు
నంద్యాల జిల్లా కేంద్రంలో ‘అధికార’ మద్దతుతో అక్రమ అంతస్తులు వెలుస్తున్నాయి. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు రావడంతో అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు రంగంలోకి దిగారు.
అధికార మద్దతుతో పునాదులు
అనిశా అధికారుల తనిఖీలు
భవనాలకు కొలతలు వేస్తున్న సిబ్బంది
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : నంద్యాల జిల్లా కేంద్రంలో ‘అధికార’ మద్దతుతో అక్రమ అంతస్తులు వెలుస్తున్నాయి. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు రావడంతో అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు రంగంలోకి దిగారు. పక్కా సమాచారంతో హాజరైన వారు మొదటి రోజు కార్యాలయంలో దస్త్రాలు క్షుణంగా పరిశీలించారు. రెండో రోజు శనివారం క్షేత్రస్థాయికి వెళ్లి భవనాల కొలతలు తీసుకోవడం గమనార్హం. పట్టణంలో 20 భవనాల వరకు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనిశా అధికారుల రెండురోజుల తనిఖీలు ప్రజాప్రతినిధులు, అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
కుళాయిల్లో అక్రమధారలు
* పట్టణంలో బొగ్గులైన్, ఇస్లాంపేట, సాయిబాబానగర్, వైఎస్సార్ నగర్, గాంధీనగర్, ఎన్జీవో కాలనీ, ఎస్బీఐ కాలనీ, బాలాజీ కాంప్లెక్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కనెక్షన్లు ఉన్నా పుర దస్త్రాల్లో లేవు. అధికారులు, సిబ్బంది నేరుగా యజమానులతో మాట్లాడుకుని కనెక్షన్లు ఇస్తున్నారు. ఒక్కొక్కదానికి రూ.3 వేల వరకు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
* సలీం నగర్, శ్రీనివాసనగర్, డేనియల్పురం తదితర ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుల లాడ్జీలు, అపార్ట్మెంట్లకు యథేచ్ఛగా నీరు అడుకుంటున్నా ఇంత వరకు వాణిజ్య కనెక్షన్లు లేకపోవడం గమనార్హం.
పెద్దల ప్రణాళిక అధికారుల వత్తాసు
* నంద్యాల పుర కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగంగా అక్రమాలకు వేదికగా మారింది. రాజకీయ అండదండతో ఏళ్ల తరబడి తిష్టవేసిన ముగ్గురు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విభాగంపై ప్రస్తుత ప్రజాప్రతినిధితో పాటు మరో మాజీ ప్రజాప్రతినిధి తమదైన ముద్ర వేస్తున్నారు. వీరిని ‘ప్రసన్నం’ చేసుకోకపోతే అనుమతులు రాని పరిస్థితి.
* నౌమాన్నగర్లో ఇటీవల 30 అడుగుల రోడ్డు చూపి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వాస్తవంగా ఐదు అడుగుల రహదారి ఉందని ఫిర్యాదు వచ్చినా కాసుల కక్కుర్తితో వదిలేశారు. రోడ్డుకు దక్షిణం వైపు అనుమతులు తీసుకుని ఉత్తరం వైపు నిర్మాణాలు చేస్తున్నా కన్నెత్తి చూడ లేదు.
* పార్కుజోన్, రెడ్జోన్, పారిశ్రామిక జోన్లలో నిర్మాణాలు జరుగుతున్నా కనీస స్థాయి తనిఖీలు కరవయ్యాయి. నౌమాన్ నగర్, ఆటోనగర్, జగజ్జనని నగర్, గూడ్స్షెడ్డు, బొమ్మలసత్రం పారిశ్రామిక ప్రాంతాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు సాగుతున్నాయి.
పది శాతం ముడుపులు
* భవనాల నిర్మాణం సమయంలో ఐదు నుంచి 10 శాతం వరకు కార్యాలయం అధికారులు, సిబ్బందికి మామూళ్లు సమర్పించుకోవాల్సిందే. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ప్రైవేటు సర్వేయర్లు నిర్మాణాలకు అధికారిక గుర్తింపు ఇస్తున్నా చర్యలు లేవు. వార్డు సచివాలయాల్లో ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేసుకుని మున్సిపల్ కార్యాలయానికి వచ్చి డబ్బులు చెల్లిస్తేనే అనుమతులు ఇచ్చేస్తున్నారు. లేకపోతే ఏదో ఓ కారణం చెప్పి పక్కన పెడుతున్నారు.
* పుర కార్యాలయం పక్కనే మూడు అంతస్తుల భవనానికి అనుమతులు లేకున్నా పట్టించుకునే వారు లేరు. బాలాజీ కాంప్లెక్స్, జగజ్జననీ నగర్, రైతునగర్, వెంకటేశ్వరపురం, పొన్నాపురం కాలనీ, చాబోలు రహదారి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నాన్ లేఅవుట్లు వెలుస్తున్నా ముందస్తుగా చేసుకున్న ఒప్పందాలతో వదిలేస్తున్నారు.
* టీడీఎస్ బాండ్ల జారీలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. స్థలాలు లేని వారికి అధికారులు బాండ్లు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారు.
ఇంజినీరింగ్ విభాగంలో గుత్తాధిపత్యం
* ఇంజినీరింగ్ విభాగంలో ఓ నాయకుని బంధువైన గుత్తేదారు ఒక్కరే 80 శాతం పనులు చేస్తున్నారు. ఇటీవల సెంట్రల్ లైటింగ్కు రూ.5.50 లక్షలు కేటాయించి పనులు చేశారు. వీటికి ర్యాటిఫికేషన్ పేరుతో మరో రూ.9.50 లక్షలకు బిల్లు పెట్టారు. పనులను సొంతం చేసుకోవడంతో పాటు అదనపు నిధులు కేటాయింపజేసుకుని జేబులు నింపుకోవడం సాధారణంగా మారింది.
* ఓ ఇంజినీరు కనుసన్నల్లోనే పనులన్నీ సాగుతున్నాయి. అంచనా వ్యయంలో 10 శాతం వరకు అధికారులు, సిబ్బందికి సర్దుబాటు చేస్తుండగా.. గుత్తేదారుని పేరుతో మరికొందరు 20 శాతం వరకు నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయం మరమ్మతులు, ఆధునికీకరణ పేరుతో గతేడాది రెండుసార్లు నిధులు మంజూరు చేయించుకున్నారు. మున్సిపాల్టీ పరిధిలో ఎవరు సివిల్ పనులు చేసినా కార్యాలయ సిబ్బందికి 10 శాతం నిధులు అప్పగించాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నుల పండుగ బెలడోనా భీమలింగేశ్వర స్వామి రథోత్సవం
[ 25-04-2024]
మండలంలోని బెలడోనా గ్రామంలో వెలిసిన భీమ లింగేశ్వర స్వామి రథోత్సవం గురువారం కన్నుల పండుగ జరిగింది. -
ముగిసిన బండలాగుడు పోటీలు
[ 25-04-2024]
మండలంలోని రామళ్ళకోట గ్రామంలో వనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా గురువారం బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పత్తికొండలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
సెబ్ పోలీసుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సెబ్ సూపరింటెండెంట్ ఎస్.రవి కుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, అక్రమ మద్యం రవాణా అమ్మకాలపై పత్తికొండ, కర్నూలు పోలీసులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. -
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?