బ్రహ్మోత్సవాలకు శ్రీగిరి క్షేత్రం ముస్తాబు
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు జరగనున్న ఉత్సవాలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.2.50 కోట్లతో పనులు
ఏర్పాట్లపై నేడు కలెక్టర్ సమీక్ష
రథశాల నుంచి నంది మండపం వరకు పురవీధుల విస్తరణ
శ్రీశైలం ఆలయం, న్యూస్టుడే : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు జరగనున్న ఉత్సవాలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి పది లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. వారికి వసతులు కల్పించేందుకు రూ.2.50 కోట్లతో వివిధ రకాల పనులు చేపడుతున్నారు. ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ మంగళవారం సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
దర్శనానికి అదనపు క్యూలైన్లు
* ఆలయానికి ఇరువైపులా ఉన్న పాత దుకాణాలు ఇటీవల తొలగించారు. ఆ స్థలంలో రేకులషెడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్లు నిర్మిస్తున్నారు.
* గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సీసీ రహదారులు నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈసారి రథోత్సవం, ప్రభోత్సవాలు ఎక్కువ మంది భక్తులు వీక్షించడానికి అవకాశం కలిగింది.
* అదనపు లడ్డూ విక్రయ కేంద్రాలు, క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. టిక్కెట్ కౌంటర్ల వద్ద కొత్తగా షెడ్డు నిర్మిస్తున్నారు.
* పాతాళగంగ స్నాన ఘాట్ల వద్ద మెష్, బారికేడ్లు, క్యూలైన్ల ప్రవేశం వద్ద కొత్తగా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు వస్తువులు భద్రపరుచుకునే గదులు సిద్ధం చేస్తున్నారు.
వీటిపై దృష్టి సారించాలి మరి
* ఉత్సవాల ప్రారంభానికి వారం రోజుల ముందుగానే భక్తులు పాదయాత్రగా వస్తారు. నాగులూటి నుంచి కైలాసద్వారం వరకు జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలి.
* బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్నందున దేవస్థానం ఆధ్వర్యంలో పలు ప్రదేశాల్లో శివదీక్షా శిబిరాలు ఏర్పాటు చేయాలి. గతంలో ఆయా శిబిరాల్లో భక్తులకు మూడు పూటలా అన్నప్రసాదం అందించేవారు. అన్నదానం చేసే దాతలకు సకాలంలో సదుపాయాలు కల్పించాలి. అన్నదాన కేంద్రాల వద్ద విద్యుద్దీపాలు, తాగునీటిని డ్రమ్ములు అదనంగా ఏర్పాటు చేయాలి.
* ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా బస్సులు, ఇతర వాహనాలను రింగ్రోడ్డు మీదుగా పార్కింగ్ ప్రదేశాలకు మళ్లిస్తారు. రింగ్రోడ్డు సుమారు 6 కి.మీ పైగా దూరం ఉంది. అంత దూరం నుంచి భక్తులు సత్రాల వద్దకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. రింగ్రోడ్డులో ప్రతి కిలోమీటర్కు ఒకచోట సత్రాలు, వసతి సముదాయాల వివరాలతో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. పలుచోట్ల ట్రాఫిక్ నియంత్రణకు గేట్లు ఏర్పాటు చేశారు. వీటి వల్ల కార్తిక మాసంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
* దుకాణాలు, హోటళ్లలో ఆహార పదార్థాలు నాణ్యతతో, నిర్ణీత ధరలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
అదనపు క్యూలైన్ కోసం ఏర్పాటు చేసిన షెడ్డు
మంచినీరు.. చలువ పందిళ్లు
* భక్తులకు 30 లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. 20 లక్షల గ్యాలన్లు ఫిల్టర్, 10 లక్షల గ్యాలన్లు క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయనున్నారు. వీటికి సంబంధించి టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారు. వెంకటాపురం, నాగులూటి, పెచ్చెరువు, కైలాస ద్వారం వద్ద నిరంతర నీటి సరఫరాకు చర్యలు చేపట్టారు.
* బ్రహ్మోత్సవాలకు వందలాది ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. డ్రైవర్లు, కండక్టర్లకు బస్టాండ్ ప్రాంగణంలో రక్షితనీటి సదుపాయాలు కల్పించాలని, ప్రత్యేక విధులకు వచ్చే డ్రైవర్లకు వసతి పెంచాలని కోరుతున్నారు.
* ఆలయ మాడవీధులు, క్షేత్ర పరిధిలో చలువ పందిళ్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు అన్నదానం చేసే ప్రదేశాల వద్ద షామియానాలు, పెండాల్స్ పనులు చేపడుతున్నారు. కైలాస ద్వారం, వెంకటాపురం వద్ద చలువపందిళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బస్సుల పార్కింగ్ ప్రదేశాల వద్ద ఏటా అరకొరగా చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్లాస్టిక్ నివారణకు సహకరించండి
[ 24-04-2024]
శ్రీశైలం అటవీ శాఖలో ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి అన్నారు. -
మైనారిటీల అభివృద్ధిని విస్మరించిన వైకాపా
[ 24-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు. -
తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు
[ 24-04-2024]
రాష్ట్రంలో తెదేపాను గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్