పత్తి పరిశ్రమ కుదేలు
ఆదోని.. పత్తి వ్యాపారానికి పెట్టింది పేరు. ప్రస్తుతం పరిశ్రమల నిర్వహణ దినదిన గండంగా మారింది. ఒకప్పుడు లక్షల పత్తి బేళ్లు ఉత్పత్తి చేసిన చరిత్ర ఆయా పరిశ్రమలకు ఉంది.
ఆదోని మార్కెట్లో పత్తి
ఆదోని మార్కెట్, న్యూస్టుడే: ఆదోని.. పత్తి వ్యాపారానికి పెట్టింది పేరు. ప్రస్తుతం పరిశ్రమల నిర్వహణ దినదిన గండంగా మారింది. ఒకప్పుడు లక్షల పత్తి బేళ్లు ఉత్పత్తి చేసిన చరిత్ర ఆయా పరిశ్రమలకు ఉంది. ఈసారి రెండు లక్షల పత్తిబేళ్లు ఉత్పత్తి అయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగు చేశారు. పది లక్షల పత్తి బేళ్ల వ్యాపారం జరుగుతుందని అందరూ అంచనా చేశారు. అకాల వర్షాలు, చీడపీడలు బారిన పడి దిగుబడి పూర్తిగా పడిపోయింది.
నిర్వహణకు తప్పని కష్టాలు
ఆదోనిలో 50-60 వరకు పత్తి పరిశ్రమలున్నాయి. ఒక్కో పరిశ్రమ స్థాపనకు రూ.10-15 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇవన్నీ సవ్యంగా కొనసాగాలంటే కనీసం రోజుకు 50 వేల క్వింటాళ్ల పత్తి కావాలి. ప్రస్తుతం ఆదోని మార్కెట్కు 2-4 వేల క్వింటాళ్ల పత్తి వస్తోంది. ముడిసరకు లేక.. వాటి విద్యుత్తు, యంత్రాలు, బ్యాంకు రుణాల కలిపి నెలకు కనీసం రూ.20-25 లక్షల రుణభారంతో నెట్టుకొచ్చేందుకు పరిశ్రమదారులు ఆపసోపాలు పడుతున్నారు. విద్యుత్తు బిల్లే కనీసం నెలకు రూ.లక్ష ఉండటం గమనార్హం. ‘‘ ధరలు పడిపోవడం, సరకు లేకపోవడంతో చాలా పరిశ్రమలు ఉత్పత్తి తగ్గించుకున్నాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది ఉపాధి దెబ్బతిసేలా చేసింది. ఇంతటి దీన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ’’ పత్తి వ్యాపార సంఘం కార్యదర్శి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
ఆర్థిక మాంద్యం ప్రభావం
ఆర్థిక మాంద్యంతో పాటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, వస్త్ర పరిశ్రమల్లో ఉత్పత్తి లేకపోవడం, నూలుకు గిరాకీ లేకపోవడం.. ఆ ప్రభావం పత్తిపై పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గతేడాది సీజన్ ఆరంభానికి ఆగస్టులో పత్తి క్వింటాలు రూ.12-13 వేలు ఉండేది. దూది కండి ధర రూ.లక్ష ఉండేది. అక్కడి నుంచి ధరలు దిగుతూ వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో పత్తి ధరలు కనిష్ఠ-గరిష్ఠంగా రూ.5-8 వేలు నడుస్తోంది. ఇక దూది కండె ధర రూ.50-62 వేలు, పత్తి గింజలు రూ.3వేలు- 3500 దాకా పలుకుతున్నాయి.
నిల్వ నష్టం రూ.30 కోట్లు
ఒక్కసారి పత్తి కొనుగోలు చేసి.. దూదిగా మలిచేందుకు రోజులు పడతాయి. అలాంటిది దీపావళి అనంతరం అధిక ధరలతో కొనుగోలు చేసిన పత్తి నిల్వలు పరిశ్రమల్లో పేరుకుపోయాయి. ఎప్పటికైనా ధర పెరుగుతుందని ఆశ. ఇలా అన్ని పరిశ్రమల్లో సుమారు 30-40 వేల బేళ్లు నిల్వ ఉంటాయనేది అంచనా. ఒక్కో బేళ్లపై కనీసం నిర్వహణ ఖర్చులు కలుపుకొంటే రూ.10 వేల దాకా ఉంటోంది. ఇలా సుమారు 30-40 కోట్లు దాకా నష్టం చవిచూడాల్సి వస్తోంది. దీంతో నష్టానికి అమ్ముకోలేక ధర కోసం ఎదురుచూస్తున్నారు.
కార్మికులకు ఉపాధి దెబ్బ
* ఆదోని మార్కెట్లో ఏటా పత్తి వ్యాపారం తగ్గుతోంది. 2020-21 ఏడాదిలో సరాసరి ఆరేడు లక్షల పత్తి బేళ్లు ఉత్పత్తి అయిన దాఖలాలూ ఉన్నాయి. 2021-22 ఏడాదిలో నాలుగు లక్షల పత్తి బేళ్లు, 2022-23 ఏడాదిలో కేవలం రెండు లక్షల పత్తి బేళ్ల వ్యాపారం సాగింది.
* మార్కెట్ యార్డు నమ్ముకుని ప్రత్యక్షంగా 4-5 వేల మంది కార్మికులు, పరోక్షంగా పది వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో హమాలీలే అధికం. వంద మంది పత్తి వ్యాపారులు, 300లకు పైగా కమీషన్ ఏజెంట్లు ఉన్నారు.
* ఏటా దసరా మొదలు ఉగాది వరకు సీజన్ నడుస్తుంది. ఈ సారి డిసెంబరు ఆరంభానికే ముగిసినట్లైంది. మార్కెట్ను నమ్ముకుని గుమస్తాలు, హోటళ్లు, తోపుడు బండ్లు, మహిళా కూలీలతో పాటు పట్టణ మార్కెట్ ఆధారపడి ఉంది. ప్రస్తుతం వ్యాపారాలు లేక డీలా పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
[ 19-04-2024]
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
జగన్ ఆటలు ఇక సాగవు..
[ 19-04-2024]
తెదేపా ఇంటింటి ప్రచారంలో భాగంగా కౌతాళం మండలం నందు బంటకుంటా గ్రామంలో ప్రతి ఇంటింటికీ వెళ్ళి జగన్ చేస్తున్న, అరాచకాలు, దోపిడి, దౌర్జన్యాలు, వివరిస్తూ, 2019లో కోడికత్తి, ఈసారి గులక రాయి అంటున్నాడని తెదేపా నేతలు పేర్కొన్నారు. -
ఇంటిఇంటికి తెలుగుదేశం
[ 19-04-2024]
ఇంటిఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, ఆయన సోదరులు రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న పాల్గొన్నారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
[ 19-04-2024]
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు