ఖర్చు ఎక్కువ.. ఆదాయం తక్కువ
ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ప్రగతి చక్రాన్ని పురోగతి వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.
ఆర్టీసీని వీడని నష్టాలు
ఈపీకే, ఈపీబీలో నంద్యాల వెనుకంజ
డోన్ పట్టణం, న్యూస్టుడే: ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ప్రగతి చక్రాన్ని పురోగతి వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. బస్సుకు కిలోమీటర్కు అయ్యే ఖర్చుకు తగినంత ఆదాయం రాక నష్టాల బాటలో నడుస్తోంది. ఈపీకే (ఎర్నింగ్ పర్ కిలోమీటర్), ఈపీబీ (ఎర్నింగ్ పర్ బస్)లో ఆదాయాన్ని తీసుకువచ్చేందుకు అధికారులు తపన పడుతున్నా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈపీకేలో నంద్యాల రీజియన్ కంటే కర్నూలు రీజియన్ అధికంగా ఉండటం గమనార్హం.
గతేడాది కంటే తక్కువ కి.మీ. తిరిగి..
ఆర్టీసీలో 2022-23లో నంద్యాల రీజియన్లో 7 డిపోలకుగాను 4,72,75,859 కి.మీ. తిరిగి రూ.170,43,92,077 ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలు రీజియన్లో 5 డిపోలకుగాను 4,48,06,067 కి.మీ. తిరగగా రూ.162,35,94,548 ఆదాయాన్ని తీసుకువచ్చాయన్నారు. నంద్యాలకు డిపోలు, బస్సులు ఎక్కువగా ఉండి కర్నూలు పరిధిలోని డిపోల కంటే ఎక్కువ కి.మీ. తిరిగి ఎక్కువ ఆదాయాన్ని తీసుకువచ్చాయి. గతేడాది (2021-22) కర్నూలు రీజియన్లో 5,01,13,656 కి.మీ.కుగాను రూ.157,40,29,181 ఆదాయం రాగా, నంద్యాల రీజియన్లో 5,19,14,891 కి.మీ.కుగాను రూ.157,78,37,756 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
* 2022-23లో కర్నూలు రీజియన్ కంటే నంద్యాల రీజియన్లో 7 డిపోలకుగాను బస్సుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో 24,69,792 కి.మీ. ఎక్కువ తిరిగి రూ.8,07,97,529 ఎక్కువ ఆదాయాన్ని సాధించగలిగింది. 2021-22 సంవత్సరంతో పోల్చితే 2022-23లో రెండు రీజియన్లలో బస్సులు తక్కువ కి.మీ. తిరిగి ఎక్కువ ఆదాయాన్ని తీసుకువచ్చాయి. ఇందుకు కారణం బస్సు ఛార్జీలు పెంచడమేనని అభిప్రాయపడుతున్నారు.
కర్నూలు రీజియన్ ముందు
కర్నూలు రీజియన్లో ఆదోని, కర్నూలు-1, కర్నూలు-2, పత్తికొండ, ఎమ్మిగనూరు డిపోలు రాగా, వాటిల్లో ఆర్టీసీ, అద్దె బస్సులు 419 ఉన్నాయి. నంద్యాల రీజియన్ పరిధిలోకి ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లి, డోన్, కోవెలకుంట్ల, నందికొట్కూరు, నంద్యాల డిపోలు వస్తాయి. వాటిల్లో ఆర్టీసీ, అద్దె బస్సులు 510 ఉన్నాయి. కానీ ఈపీకే, ఈపీబీ విషయంలో నంద్యాల రీజియన్ కంటే కర్నూలు రీజియన్లో ఆదాయం మెరుగ్గా ఉంది.
* ఈపీకేలో నంద్యాల రీజియన్లో 7 డిపోలకుగాను సగటున రూ.36.05 రాగా, కర్నూలు రీజియన్లో ఐదు డిపోలకే రూ.36.24 రావడం గమనార్హం. కర్నూలు-1 డిపోకు సంబంధించి రూ.38.12 ఎక్కువ ఈపీకే సాధించగా, ఆదోని డిపో రూ.33.73తో తక్కువ తీసుకువచ్చింది. నంద్యాల రీజియన్లో ఆత్మకూరు డిపో రూ.37.98 ఎక్కువ రాగా, డోన్ రూ.34.11 వచ్చింది.
* ఈపీబీ విషయంలో కర్నూలు రీజియన్లో సగటున రూ.16,473 రాగా, నంద్యాల రీజియన్లో రూ.13,613తో వెనుకంజలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
‘‘మద్యం కారణంగా అన్యాయానికి గురవుతున్న అక్కచెల్లెమ్మల బాధ చూడలేకున్నా.. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం అమలు చేస్తామని’’ 2017లో ప్రజా సంకల్ప పాదయాత్రకు చాగలమర్రికి వచ్చిన సందర్భంలో జగన్ ప్రగల్భాలు పలికారు.