logo

అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం

తుగ్గలి మండలం రాంపల్లి గ్రామ సచివాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. అద్దె చెల్లించకపోవడంతో యజమాని నాగిరెడ్డి సోమవారం సచివాలయానికి తాళం వేశారు.

Published : 31 Jan 2023 02:12 IST

సచివాలయానికి తాళం వేయడంతో బయట కూర్చొన్న సిబ్బంది

తుగ్గలి, న్యూస్‌టుడే: తుగ్గలి మండలం రాంపల్లి గ్రామ సచివాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. అద్దె చెల్లించకపోవడంతో యజమాని నాగిరెడ్డి సోమవారం సచివాలయానికి తాళం వేశారు. 15 నెలల అద్దె రూ.37,500 బకాయి ఉందని, చెల్లించకపోవడంతో విసుగు చెందిన యజమాని సచివాలయానికి తాళం వేశారు. దీంతో సచివాలయ సిబ్బంది బయట కూర్చొని విధులు నిర్వహించారు. ఎంపీడీవో బాషా స్పందించి ఇంటి యజమానికి సర్దిచెప్పడంతో సోమవారం సాయంత్రానికి సచివాలయానికి వేసిన తాళం తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని