నిత్యం రూ.8 లక్షలు.. నెలకు రూ.2.40 కోట్లు
ఉమ్మడి జిల్లాలో 70కిపైగా గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి నెలా 6.90 లక్షల సిలిండర్ల (వాయుబండల) వినియోగం జరుగుతోంది.
ఆగని గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది వసూళ్లు
నిరాకరిస్తే సిలిండర్లు ఇవ్వని వైనం
న్యూస్టుడే - కర్నూలు సచివాలయం
ఉమ్మడి జిల్లాలో 70కిపైగా గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి నెలా 6.90 లక్షల సిలిండర్ల (వాయుబండల) వినియోగం జరుగుతోంది. 14.2 కిలోల సిలిండరు ధర రూ.1,055.24. కేంద్ర పన్ను రూ.26.38, రాష్ట్ర పన్ను రూ.26.38 కలిపి మొత్తం రూ.1,108.00 తీసుకోవాల్సి ఉంది.
ఏజెన్సీల పరిధిలో పని చేస్తున్న సిబ్బంది ఇంటింటికి చేరవేస్తున్నారు. ఒక్కో వ్యక్తి 30-40 సిలిండర్ల వరకు సరఫరా చేస్తున్నారు. ఒక్కోదానికి రూ.30 మొదలు రూ.40, రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.100 వరకు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. నెలకు 6.90 లక్షల సిలిండర్ల వినియోగం ఉండగా రోజుకు 23,000 వరకు సరఫరా చేస్తున్నారు. 80 శాతం పైబడి సిలిండర్లకు రూ.40 చొప్పున రూ.8 లక్షలకుపైగా వసూలు చేస్తున్నారు. ప్రతి నెలా రూ.2.40 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు.
11.95 లక్షల కుటుంబాలు.. 11.56 లక్షల కనెక్షన్లు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 11.95 లక్షల కుటుంబాలున్నాయి. ఇందులో 11.56 లక్షల కుటుంబాలు వంట గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్లు 52,089 వరకు ఉన్నాయి. దీపం కనెక్షన్లు 3,93,820 ఉండగా, సాధారణ కోటాలో 7,00,495 కుటుంబాలు సిలిండర్లు తీసుకున్నాయి. వినియోగదారులకు సిలిండర్లు సరఫరా చేసేందుకు గ్యాస్ అధీకృత డీలర్లు సిబ్బందిని నియమించుకున్నారు. వీరికి ఎలాంటి వేతనాలు ఇవ్వకపోవడంతో వినియోగదారుల వద్ద వసూలు చేస్తున్నారు.
మితిమీరిన సిబ్బంది ఆగడాలు
* సిలిండర్ తీసుకొచ్చినందుకు రూ.50 ఇవ్వాలని నగరంలోని ఓ ఏజెన్సీకి చెందిన సిబ్బంది డిమాండ్ చేశారు. వినియోగదారుడు రూ.30 ఇస్తామంటే.. అయితే గోదాముకు వెళ్లి తెచ్చుకోండని.. లేకుంటే ఏజెన్సీని మార్చుకోమని వినియోగదారుడితో వాగ్వాదానికి దిగారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. అదనపు డబ్బు ఎందుకు ఇవ్వాలని వినియోగదారుడు ప్రశ్నిస్తే ఆ తర్వాతి నెలలో జాప్యం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆన్లైన్లో రుసుము ముందస్తుగానే చెల్లించినప్పటికీ. అదనంగా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.
* నగరంలో, పట్టణాల్లో అపార్ట్మెంట్లు వెలిశాయి. పైకి వెళ్లి చేర్చేందుకు తప్పనిసరిగా అదనపు రుసుము వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే అపార్ట్మెంట్ కింద పెట్టేసి వెళ్తున్నారు. డోర్ లాక్ ఉన్న ఇళ్లకు డెలివరీ చేసే వాయుబండలను రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా తీసుకుని ఇతరులకు విక్రయిస్తున్నారు. హోటళ్లు, వ్యాపార వాణిజ్య దుకాణాలకు ఈ రాయితీ సిలిండర్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల ట్రాలీ ఆటోను కూడా డెలివరీ బాయ్లే పెట్టుకొని ఈ దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
నేతల కనుసన్నల్లో ఏజెన్సీలు
రాజకీయ నేతల కనుసన్నల్లోనే గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. అంతా వారు చెప్పినట్లే నడుస్తున్నాయి. పౌరసరఫరాల అధికారులు గ్యాస్ ఏజెన్సీలను తనిఖీలు చేసిన దాఖలాలే లేవు. వారి వద్దకు వెళ్లేందుకు అధికారులు వెనకాడుతున్నారు. నగరంలో ఏ శుభకార్యం జరిగినా మా గ్యాస్ ఏజెన్సీకి చెందిన సిలిండర్లే తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్న సంఘటనలు లేకపోలేదు. అధికార పార్టీకి చెందిన కొందరు గ్యాస్ ఏజెన్సీల డీలర్ల ఆగడాలు మితిమీరిపోయాయి. అదనపు రుసుము వసూలు చేస్తున్నారని వినియోగదారులు డీలర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
ఫోన్లో ఫిర్యాదు చేయొచ్చు
ఎల్పీజీ సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని, అదనంగా ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటనలు చేస్తున్నా ఎక్కడా అమలుకావడం లేదు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వసూలు చేస్తున్నట్లయితే కాల్ సెంటర్ 1967, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోని టోల్ఫ్రీ నంబరు 1800 2333555కు ఫిర్యాదు చేయొచ్చు. ‘‘ ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. డెలివరీ బాయ్లు అదనపు రుసుము వసూలు చేయకుండా చూడాలని పలుమార్లు ఏజెన్సీల నిర్వాహకులకు సూచించాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని’’ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా పార్టీ కార్యాలయం ప్రారంభం
[ 29-03-2024]
కౌతాళం మండలంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి, నాయకులు ప్రారంభించారు. -
దేశ పర్యటనకు బయలుదేరిన అహోబిలం పీఠాధిపతి
[ 29-03-2024]
అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ దేశ పర్యటనకు బయలుదేరారు. -
ఆలూరు నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగరవేస్తాం
[ 29-03-2024]
ఆలూరు నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ను గెలిపించి తెదేపా జెండా ఎగరవేస్తామని ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ ఉపాధ్యక్షులు సాలి సాహెబ్, మండల తెదేపా నాయకులు సతీష్ కుమార్ అన్నారు. -
రానున్న ఎన్నికల్లో తెదేపాదే అధికారం
[ 29-03-2024]
బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెదేపా పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
ఎమ్మిగనూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
పట్టణంలోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. -
ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర గౌడ్
[ 29-03-2024]
ఆలూరు తెదేపా అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ను అదిష్ఠానం ప్రకటించింది. దీనికి సంబంధించి శుక్రవారం జాబితాను విడుదల చేసింది. -
ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకుందాం
[ 29-03-2024]
ఆదోని పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. -
ఆలూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలూరులో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పార్టీ డాక్టర్ సెల్ కార్యదర్శి నెట్టెప్ప ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
[ 29-03-2024]
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
తెదేపాతోనే పేదలకు న్యాయం
[ 29-03-2024]
తెదేపాతోనే పేద, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి నర్సప్ప అన్నారు. -
సీ బెళగల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
మండలకేంద్రమైన సీ బెళగల్లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు