సమాజ హితం.. సేవే అభిమతం
విద్యార్థి దశలో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించి దేశభక్తి చాటేలా సిద్ధం చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విభాగం స్కౌట్ అండ్ గైడ్. మూడేళ్లపాటు శిక్షణ పొంది జాతీయ స్థాయి పదర్శనకు వెళ్తే గవర్నర్ ద్వారా ధ్రువపత్రం అందిస్తారు.
స్కౌట్, గైడ్ శిక్షణ యువతకు రక్షణ
న్యూస్టుడే, ఎమ్మిగనూరు
రాజస్థాన్లో పాల్గొన్న స్కౌట్ అండ్ గైడ్ సభ్యులు
విద్యార్థి దశలో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించి దేశభక్తి చాటేలా సిద్ధం చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విభాగం స్కౌట్ అండ్ గైడ్. మూడేళ్లపాటు శిక్షణ పొంది జాతీయ స్థాయి పదర్శనకు వెళ్తే గవర్నర్ ద్వారా ధ్రువపత్రం అందిస్తారు. దీంతో రైల్వే ఉద్యోగాల్లో పది శాతం, ఇంజినీరింగ్, తదితర కోర్సుల్లో కొంతమేర రిజర్వేషన్లు ఉంటాయి. ఈ విభాగంలో చేరిన కొందరు ఎమ్మిగనూరు ఎనిమిది మంది బాలికలు సత్తా చాటి రాజస్థాన్లో ప్రతిభా పురస్కారం అందుకున్నారు.
* పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఎనిమిది మంది బాలికలు రాష్ట్ర స్థాయి స్కౌట్ అండ్ గైడ్లో పాల్గొని ప్రతిభ చూపారు. పాఠశాలకు చెందిన హేమలత, సాయిశ్రీరచన, హిమశ్రీ, మదీన, సుహానా, చంద్రిక, మహాలక్ష్మి, భవాని, అక్షిత, జ్ఞానేశ్వరి రాజస్థాన్ రాష్ట్రంలోని పాలిమర్స్లో జనవరి 4వ తేదీ నుంచి 10వతేదీ వరకు శిక్షణ ఇవ్వగా దేశభక్తి, క్రమశిక్షణ, నిరంతరం సేవ, విపత్తు సమయాల్లో రక్షణ వంటి అంశాల్లో చొరవ చూపారు. నాయకత్వ లక్షణాల పెంపు, కమ్యూనికేషన్, పరిపాలన, ఏవియేషన్ స్కిల్స్ కార్యక్రమాల్లో అవకాశాలు కల్పించడం, ప్రథమ చికిత్స, జాతీయ గీతాలాపన, జాతీయ జెండా కట్టే విధానం, ప్రజలను చైతన్యం చేయడం వంటి అంశాల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలిచ్చి పురస్కారం అందుకున్నారు.
రెండేళ్లుగా సాధన చేశాను
- సాయిశ్రీరచన, మాచాని సోమప్ప ఉన్నత పాఠశాల
రాజస్థాన్లో జరిగిన రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ చూపేందుకు మా పాఠశాలలో రెండేళ్లుగా సాధన చేశాను. కర్నూలులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నా. ఈ ఏడాది జాతీయ స్థాయి శిక్షణలో భాగంగా రాజస్థాన్లో సమాజ చైతన్యం, సామాజిక, మానసిక, మేధోపరంగా అభివృద్ధి అంశాలపై ప్రతిభ చూపడంతో పురస్కారం అందజేశారు. అక్కడా నాయతక్వ లక్షణాలతోపాటు, నైపుణ్యం, కమ్యూనికేషన్, పరిపాలన, ఇతర కార్యక్రమాలపైనా అవగాహన కల్పించారు.
నైతిక విలువలపై అవగాహన
- మరియా, ఎమ్మిగనూరు
ఏపీ తరఫున రాజస్థాన్లో నాయకుడికి ఉండాల్సిన లక్షణాలపై శిక్షణ తీసుకున్నా. నైతిక విలువలపై ప్రజలకు అవగాహన కల్పించాను. జిల్లాలో వెనుక బడిన ప్రాంతాల పిల్లలను విద్య వైపు ప్రోత్సహించే అంశంపై శిక్షణ ఇచ్చారు. వయోజనుల్లో అక్షరాస్యత పెంపొదించడంపైనా అవగాహన వచ్చింది. ప్రజా సేవా కార్యక్రమాలపై ధ్యాస పెట్టడం అక్కడ నేర్పారు. శిక్షణతోపాటు నిరంతరం సాధన చేశాను రాజస్థాన్లో ఆరు రోజులపాటు వివిధ అంశాల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలిచ్చి పురస్కారం అందుకున్నా.
సేవా కార్యక్రమాలపై శిక్షణ
- చంద్రిక, తొమ్మిదో తరగతి
పాఠశాలలో చేపట్టిన స్కౌట్ అండ్ గైడ్లో చేరి రెండేళ్లుగా శిక్షణ తీసుకున్నా. నిత్యం వ్యాయామం చేయడంతో ఆరోగ్యంగా ఉన్నాం. దేశభక్తి పెంచేలా పాఠాలు, విపత్తులు సంభవిస్తే చేయాల్సిన పనులపై అవగాహన కలిగింది. రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా గాయపడితే తక్షణమే ప్రథమ చికిత్స చేయించి ఆస్పత్రికి తరలించడం నేర్చుకున్నా. నాయకత్వ లక్షణాలపై నేర్పిన పాఠాలు ఎంతో ఉపయోగపడతాయి. రాజస్థాన్లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో వారు నేర్పిన అంశాల్లో ప్రతిభ చూపి పురస్కారం అందుకున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రానున్న ఎన్నికల్లో తెదేపాదే అధికారం
[ 29-03-2024]
బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెదేపా పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
ఎమ్మిగనూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
పట్టణంలోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. -
ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర గౌడ్
[ 29-03-2024]
ఆలూరు తెదేపా అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ను అదిష్ఠానం ప్రకటించింది. దీనికి సంబంధించి శుక్రవారం జాబితాను విడుదల చేసింది. -
ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకుందాం
[ 29-03-2024]
ఆదోని పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. -
ఆలూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలూరులో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పార్టీ డాక్టర్ సెల్ కార్యదర్శి నెట్టెప్ప ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
[ 29-03-2024]
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
తెదేపాతోనే పేదలకు న్యాయం
[ 29-03-2024]
తెదేపాతోనే పేద, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి నర్సప్ప అన్నారు. -
సీ బెళగల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
మండలకేంద్రమైన సీ బెళగల్లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!